E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Fake Liquor Case: అరెస్ట్‌పై జోగి రమేష్ భార్య శకుంతల రియాక్షన్.. అరెస్టుకు ముందు ఇదే జరిగింది?

Fake Liquor Case: అరెస్ట్‌పై జోగి రమేష్ భార్య శకుంతల రియాక్షన్..  అరెస్టుకు ముందు ఇదే జరిగింది?
Advertisement

Fake Liquor Case: నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అరెస్టు కావడంతో ఆనాటి నుంచి నేతలకు టెన్షన్ మొదలైంది. దాదాపు నెల రోజులుగా ఈ వ్యవహారంపై పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. చివరకు ఛార్జిషీటు జోగి రమేష్ పేరు చేర్చింది.  ఆ తర్వాత సిట్ వేగంగా అడుగులు వేసింది.

బిగ్ టీవీతో మాట్లాడిన జోగి రమేష్ భార్య 

Advertisement

ఆదివారం ఉదయం జోగి రమేష్‌ని అరెస్టు చేసింది. అసలు అరెస్టుకు ముందు రమేష్ ఇంట్లో ఏం జరిగింది? ఆ విషయాలను బిగ్ టీవీతో పంచుకున్నారు ఆయన భార్య శకుంతల. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర లేదని ఆయన భార్య శకుంతల బిగ్ టీవీతో చెప్పారు. కావాలనే ఈ కేసులో తన భర్తను ఇరికించారని తెలిపారు. చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు లోకేష్ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.

గతంలో అగ్రి గోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారని, దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశామన్నారు. పైన దేవుడు ఉన్నాడని, అన్నీ చూసుకుంటాడని, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

ఆనాడు నుంచి కక్ష పెంచుకున్నారు-శకుంతల

ఉదయం నాలుగున్నరకు వచ్చి తలుపులు దబ దబ కొడుతున్నారని, అందరూ ఉలిక్కిపడి లేచామన్నారు. కిందకు ఫోన్ చేస్తే.. వాచ్‌మేన్ అసలు విషయం చెప్పారని వివరించారు శకుంతల. అరెస్టు సమయంలో తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. అన్యాయంగా అరెస్టు చేశారని, న్యాయం తప్పుకుండా గెలుస్తుందన్నారు.

ALSO READ: జోగి రమేష్‌ అరెస్టుపై జగన్ రియాక్ట్

నచ్చని విషయాలు ప్రశ్నిస్తున్నందుకు కూడా కారణమన్నారు. ఆనాడు క్షమాపలు చెప్పడానికి వెళ్లారని, కానీ దాడి చేయడానికి వచ్చినట్టు కల్పించారన్నారు. వారికీ కుటుంబాలు ఉంటాయని, ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. రేపు రోజున జగన్ వచ్చి శిక్షించాల్సిన అవసరం లేదని, పైన దేవుడు ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన శిక్షిస్తారన్నారు.

 

 

Related News

ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?

నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’, ఆ రిపోర్ట్ ఆందోళనకరం

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు

Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?

కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!

Big Stories

×