Priyanka Death: ఏపీ లోని రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిన తాగుబోతుల కారు చక్రం కింద నలిగిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక మరణించారని సికిద్రబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెడికల్ విద్యార్థిని ప్రియాంక సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు చికిత్స పొందుతూ మరిణిచారు.
కారు తలపై నుండి వెళ్లడంతో బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయి వెంటిలేటర్ పై ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ఈరోజు ఆమే మరణించారు. ప్రియాంక చావుకి కారణమైన ఇద్దరు నీ కఠినంగా శిక్షించాలని, వారిని ఉరితీయాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం ను మరింత సీరియస్గా తీసుకోవాలని నా కూతురు పరిస్థితి వేరొక అమ్మాయికి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత.. మమతా బెనర్జీ కారుపై రాళ్లు విసిరిన నిరసనకారులు!
రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర మందుకొట్టిన మత్తోన్మాదుల వల్ల బలై పోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించారు. నామవరానికి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దస్వంత్, జోసఫ్ విపరీతంగా మందు కొట్టి మాల్ లోకి వచ్చారు. అక్కడ కూడా మత్తులో ఇష్టారాజ్యం చేశారు. అప్పటికీ మాల్ సెక్యూరిటీ వీరిని బయటకు పంపేందుకు ట్రై చేశారు. గేటు దాటేటప్పుడు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గాళ్లు సెక్యూరిటీతో గొడవ చేశారు.
సెక్యూరిటీపై ఉన్న కోపంతో రగిలిపోయిన ఈ ఉన్మాదులు కారును జెట్ స్పీడ్ తో పోనిచ్చారు. సరిగ్గా అదే టైంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టారు. స్కూటీ వెనక కూర్చున్న మెడికల్ స్టూడెంట్ కి గట్టిగా దెబ్బలు తాకాయి. ఆమె కింద పడిపోయింది. దీంతో అడ్డుకున్న సెక్యూరీటిని డామినేట్ చేస్తూ దూసుకోళ్లడంలో భాగంగా ఆమె తలపై నుంచి కారు తొక్కిస్తూ రాక్షసంగా ముందుకెళ్లారు. దీంతో అక్కడి వారు ప్రింయాంకను ఆసుపత్రికి చేర్పించారు. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్కి అప్పటికే బ్రేయిన డెడ్ అయి కోమాలోకి వెల్లిపోయి నేడు ప్రియాంక మరణించింది.
Also Read: BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!