E-Paper
Advertisement

పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!

పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!
Advertisement

Lightning Strike: శ్రీకాకుళం జిల్లా మందస లో దారుణం చోటు చేసుకుంది. పిడుగు పాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో నలుగురు మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఈ సంఘటన కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెలితే.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెడాంగో గ్రామంలో పిడుగుపాటు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొలంలో వరినాట్లు నాటుతుండగా పిడుగుపాటు పడి ఆరు మంది మహిళలు ప్రమాదానికి గురయ్యారు.

వరి నాట్లు వేస్తూ..

అయితే గత మూడు నాలుగు రోజులుగా జిల్లాలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. దీంతో పెడాంగో గ్రామ పొలంలో ఈ ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు వరి నాట్లు నాటుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. దీంతో వర్షం కారణంగా సమీపంలో గల ఓ చెట్టు క్రిందకు మహిళలు వెళ్లారు. అదే చెట్టుపై పిడుగు పడడంతో జ్వర అనే (44) మహిళతో పాటు కౌముంద్రి(43)అనే మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Also Read: రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!

తీవ్రగాయాలతో..

వీరితో మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుయ బరిణి, కుమార్ నీలవతి, కాట సుస్మిత, మద్య దేవక అనే మహిళలకు గాయాలయ్యాయి. ఈ నలుగురిని 108 లో హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మందస మండలం పాతకోట అనే గిరిజన గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

Tags

Related News

నెల్లూరు కంచుకోటపై YCP కన్ను.. పోయిన చోటే పట్టు సాధించేలా బిగ్ ప్లాన్!

కార్పొరేట్ ఉద్యోగం వదిలి TNR డైరీ ఫామ్.. ప్రకాశం జిల్లా మహేష్ సక్సెస్ స్టోరీ!

కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!

రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!

బాబు హెచ్చరిక.. విజయ్ ఆదేశాలు.. ఇసుక దందాకు చెక్ పడేనా?

20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?

Big Stories

Advertisement
×