Kadambari Jethwani: తనపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ముంబైకి చెందిన నటి, డాక్టర్ కాదంబరి జెత్వానీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ సీఐడీ తనపై చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తనను, తన కుటుంబాన్ని బలిపశువులను చేసేందుకు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. అలాగే వాటిపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే తమపై తీవ్రమైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐడీ పై జిత్వానీ ఫైర్..
ముఖ్యంగా తన బ్యాంక్ ఖాతాలో జమ అయిన రూ.4.5 లక్షల నగదుపై వస్తున్న పుకార్లపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఆ సొమ్ము పూర్తిగా చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలకు సంబంధించినదే తప్ప, అందులో ఎలాంటి అక్రమాలు లేదా చట్టవిరుద్ధమైన వ్యవహారాలు లేవని తేల్చి చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా సమాజంలో తన ప్రతిష్ఠను దిగజార్చేలా సీఐడీ వ్యవహరించడం సరైంది కాదని మండిపడ్డారు.
Also Read: లీక్ల చరిత్ర కాంగ్రెస్, BRSదే.. రాజీనామాలు అడిగే హక్కు మీకెక్కడిది? కిషన్ రెడ్డి
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడతా..
గత రెండేళ్లకు పైగా తాను, తన కుటుంబం న్యాయం కోసం సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నామని కాదంబరి జిత్వానీ తెలిపారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా సత్యం వైపే నిలబడతానని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టంపైనా, న్యాయస్థానాలపైనా తనకు పూర్తి విశ్వాసం ఉందని, చివరికి కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.
CID ఛార్జ్షీట్పై నటి కాదంబరి జిత్వానీ స్పందన
తనపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ముంబై నటి, డాక్టర్ కాదంబరి జిత్వానీ వీడియో విడుదల చేస్తూ తీవ్రంగా ఖండించారు. తన కుటుంబంపై నమోదు చేసిన కేసులు తప్పుడువని, ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం… pic.twitter.com/vTD4Dqp5uC
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2026