Suicide Note: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దారుణ గటన చోటు చేసుకుంది. పిట్లా వంశీ అనే యువకువడు బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. చనిపోయిన యుకుడు పెయింటర్గా పనిచేసేవాడు. అతడు మరణించు ముందు తన సూసైడ్ నోట్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పడు కలకలం రేపుతుంది.
సూసైడ్ నోట్లో నా చావుకు కారణం ప్రదాని నకేంద్ర మోది కారణం అని, ఎవరిని ఎం అనవద్దని యువకుడు తెలుపుతూ తన సూసైడ్ నోట్ను సర్ ఫారం మీద స్పష్ట్రంగా రాసి పక్కకు అంటి పెట్టి ఆత్మహత్యకు చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరిలించారు. వంశీ మృతితొ గ్రామంలో విషాద చాయల అలుముకున్నాయి.
Also read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
ఈ సంఘటన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలో జరిగింది. దీంతో ఈ ఘటన జరగడంతో నేరుగా దేశ ప్రధాని మోదీ పేరు లేఖలో ప్రస్థావించడంతో అటు రాష్ట్రంలోని విపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సోషల్ మీడియా వేదికతగా ప్రజలు తీవ్రంగా స్పందిస్తునారు.
ఢిల్లీ మంటలు..
నరేంద్ర మోడీ, బీజేపీ అరాచకం సిరిసిల్ల, తెలంగాణ దాకా పాకిందా??
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ కారణమంటూ నోట్ రాసి పిట్ల వంశీ అనే యువకుని ఆత్మహత్య.బండి సంజయ్ గారు దీనిపైన మీ స్పందన ఏంటి?? pic.twitter.com/HYrWp8RWOi
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) July 23, 2026
Also Read: Gadwal: గద్వాల్లో మళ్లీ మొదలైన బుల్డోజర్ల హడావుడి..!