BigTV English
Advertisement

Kadapa Crime: ఆ నీచుడి కొంప కొల్లేరే.. ఏకంగా బుల్డోజర్ తో కూల్చేశారు.. అసలేం జరిగిందంటే?

Kadapa Crime: ఆ నీచుడి కొంప కొల్లేరే.. ఏకంగా బుల్డోజర్ తో కూల్చేశారు.. అసలేం జరిగిందంటే?

Kadapa Crime: భారతదేశంలో చిన్నారుల రక్షణ కోసం అనేక చట్టాలు, నిబంధనలు అమలులో ఉన్నా, ఇంకా అమానవీయ ఘటనలు వెలుగు చూస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇటీవలి కడప జిల్లాలో జరిగిన ఘటన ఈ సత్యాన్ని మళ్ళీ రుజువు చేసింది. మైలవరం మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో మూడేళ్ల చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటన దేశవ్యాప్తంగా అందరిని కలచివేసింది. అయితే స్థానికులు మాత్రం తమ కోపాన్ని ఆపుకోలేక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటి? అసలేం జరిగిందో తెలుసుకుందాం.


ఘటన వెనుక దాగిన దారుణం
ఘటన తాలూకు వివరాల ప్రకారం, మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఒక వివాహ వేడుక కోసం గ్రామానికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు చిన్నారికి అరటిపండు ఆశ చూపించి, గ్రామానికి కొద్దిగా దూరంగా తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి ముళ్ళపొదల్లో పడేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామం మొత్తం విషాదఛాయలో మునిగిపోయింది.

తల్లిదండ్రుల గల్లంతు ఫిర్యాదు.. పోలీసులు అలర్ట్
చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గ్రామస్తులు కలిసి గాలింపు చేపట్టగా, చిన్నారి మృతదేహం ముళ్ళ పొదల్లో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ఆధారంగా స్థానిక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.


ప్రజల ఆగ్రహం.. ఇంటిపై బుల్డోజర్
ఈ ఘటనపై గ్రామస్థుల్లో తీవ్రమైన కోపం నెలకొంది. నిందితుడిపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోపం ఏ స్థాయికి చేరింది అంటే, నిందితుడి ఇంటిని స్వయంగా కూల్చివేశారు. గ్రామస్థులంతా కలిసి బుల్డోజర్‌ సహాయంతో అతని ఇంటిని ధ్వంసం చేశారు. ఇలాంటి నరరూప రాక్షసుడికి ఇల్లు ఎందుకు? అంటూ తీవ్ర ఆవేశం వ్యక్తం చేశారు.

Also Read: Raja Singh On TTD: తిరుమలలో నిఘా ఎక్కడ? ఐడీ కార్డులు చెక్ చేయలేరా? రాజాసింగ్ ఫైర్..

పోక్సో చట్టం కింద కేసు..
పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినవారికి జీవిత ఖైదు నుంచి ఉరి వరకు శిక్ష విధించే అవకాశముంది. ఈ కేసును వేగవంతంగా విచారించాలని, నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించాలని గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు, బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో స్పందన
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఒక పసిపాప బతకలేదేమో కానీ, మానవత్వం కూడా చచ్చిపోయిందా? అంటూ ప్రజలు హృదయవిదారకంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు’’ అని నినదిస్తున్నారు.

ప్రభుత్వానికి డిమాండ్లు
చిన్నారి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, న్యాయపరంగా బలంగా నిలబడేందుకు ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, నివాసం, భద్రత వంటి అంశాల్లో మద్దతు ఇవ్వాలని పలువురు నాయకులు, సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×