E-Paper
Advertisement

Raja Singh On TTD: తిరుమలలో నిఘా ఎక్కడ? ఐడీ కార్డులు చెక్ చేయలేరా? రాజాసింగ్ ఫైర్..

Raja Singh On TTD: తిరుమలలో నిఘా ఎక్కడ? ఐడీ కార్డులు చెక్ చేయలేరా? రాజాసింగ్ ఫైర్..
Advertisement

Raja Singh On TTD: హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రస్తుతం వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచింది. ఇటీవల తిరుమల కొండపై ముస్లిం వ్యక్తి నమాజ్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హిందూ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, భక్తులు దీనిపై తీవ్ర స్పందన తెలుపుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో అన్యమత వీడియో?
తిరుమల కొండపై అన్యమతానికి చెందిన వ్యక్తి ప్రార్థన చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇతర మతాల ప్రదర్శనలు, ప్రార్థనలు నిషిద్ధమని మనకు తెలిసిందే. ఇది కేవలం భక్తి స్థలమే కాదు, నిబంధనలు ఉన్న ప్రాంతం కూడా. తిరుమలలోకి ఎవరైనా ప్రవేశించే ముందు కట్టుబడి ఉండాల్సిన నియమ నిబంధనలున్నాయి. డ్రైవర్ల నుండి భక్తుల వరకు అందరికీ ID కార్డులు చెక్ చేస్తారు. అలాంటి తరుణంలో ఇలా జరుగుతుండటంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

Advertisement

రాజాసింగ్ ఏమన్నారంటే?
ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ, తిరుమలను అపవిత్రం చేయాలన్న కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడుకొండలు కాదు ఐదు కొండలని ప్రచారం జరిగిందన్నారు. జగన్ పాలనలో సైతం తిరుమలపై మళ్లీ కుట్రలు సాగాయన్నారు. విదేశీ మతాలను తిరుమలలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపించారు. ఇదంతా హిందూ ధర్మాన్ని తగ్గించాలన్న కుట్రేనని రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ చేశారు.

అలాగే తిరుమల చెక్‌పోస్టు దగ్గర వాహనాల్ని పూర్తిగా తనిఖీ చేస్తుంటే, ఇలాంటి వ్యక్తి ఎలా ప్రవేశించాడన్నది ప్రశ్నార్థకమని ఆయన మండిపడ్డారు. నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

చట్టపరమైన అంశాలు
తిరుమల ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిపాలిస్తోంది. ఇది హిందూ మత స్థలంగా గుర్తించబడింది. ఇక్కడ తదితర మత ప్రచారాలు, ఆచారాలు, ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఇది 1989లో తెచ్చిన Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act ప్రకారం అమలవుతుంది. దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం TTDకు ఉంది. ఇప్పటికే గతంలో అన్యమత ప్రచార ఘటనల తర్వాత, TTD కఠిన చర్యలు తీసుకుంది. భక్తుల

ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో భక్తుల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. ‘ఇది భక్తుల మనోభావాలను గాయపరచే ఘటన అని పలువురు అభిప్రాయపడ్డారు. తిరుమల వంటి పవిత్ర ప్రాంతం సాంప్రదాయానికి ప్రతీకగా నిలవాలని, దీన్ని ఏ మత రాజకీయాలకు వేదిక చేయకూడదని వారంటున్నారు. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశాన్ని మత రాజకీయాల కోణంలో చూడకుండా, చట్టాన్ని అనుసరించి విచారణ జరగాలని సూచిస్తున్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా సరే, అది నిబంధనలకు విరుద్ధమైతే చర్యలు తప్పవని అంటున్నారు.

Also Read: Srisailam: శ్రీశైలం చుట్టూ 8 అద్భుతాలు.. టూర్ వెళితే మిస్ కాకండి!

ఈ ఘటన TTD భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు వేస్తోంది. చెక్ పోస్టుల దగ్గర వాహనాల, వ్యక్తుల తనిఖీ చాలా కఠినంగా ఉంటుందని సమాచారం. అలాంటప్పుడు ఇలా నమాజ్ చేయడానికి అనుమతినిస్తే, భద్రతా లోపమని భావించవచ్చు. ఈ నేపథ్యంలో, మరింత కఠినంగా నియమాలు అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఐడి కార్డులు చెక్ చేయాలి.. రాజాసింగ్
తిరుమలకు వచ్చే ప్రతి వాహన డ్రైవర్ ఐడికార్డులను చెక్ చేయాలని, అన్యమతానికి చెందిన వారైతే తప్పక కొండ కింద ఉంచాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు దృష్టి సారించాలని రాజా సింగ్ కోరారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×