E-Paper
Advertisement

TDP vs YCP in Kakinada: కాకినాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు.. అసలేం జరిగిందంటే?

TDP vs YCP in Kakinada: కాకినాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు.. అసలేం జరిగిందంటే?
Advertisement

TDP vs YCP in Kakinada: కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే కాకినాడలో నిర్వహించిన ఓ కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఒకే ఒక్క పదం ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఇంతకు ఆ పదం ఏమిటో తెలుసా.. వైసీపీ ఎన్నికల సమయంలో నిర్వహించిన సిద్ధం కార్యక్రమం. అసలేం జరిగిందంటే..

కాకినాడలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శెట్టిబలిజ సంఘం అధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సైతం పాల్గొన్నారు. కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement

ఇలా మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు సిద్ధం అంటూ గట్టిగా నినదించారు. దీనితో మంత్రి సైతం సీరియస్ అయ్యారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సిద్ధం అని అరవడం ఎంతవరకు సమంజసమని మంత్రి అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడే గల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా మరొకసారి సిద్ధం అంటూ నినదించారు.

ఇలా చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ నేతలు ఒకవైపు వైసీపీ నేతలు మరోవైపు తాము కూర్చున్న కుర్చీలను సైతం విసురుకున్నారు. అలాగే కొద్దిసేపు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా చిట్టచివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘర్షణకు పాల్పడుతున్న వారిని పోలీసులు అక్కడి నుండి పంపించి వేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చల్లబడింది.

Advertisement

Also Read: Rammurthy Naidu – CM Chandrababu: తమ్ముడా ఇక సెలవు.. చెమ్మగిల్లిన కళ్లతో.. పాడె మోసిన చంద్రబాబు

కార్తీక వనభోజనాల కార్యక్రమం కాస్త ఘర్షణకు దారితీయగా, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సిద్దం అంటూ వైసీపీ బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దం అనే ఒకే ఒక్క పదం, ఇక్కడి ఘర్షణకు కారణం కావడం విశేషం. ఘర్షణ జరుగుతుండగా, మంత్రి సుభాష్ ను పోలీసులు అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×