Konaseema Canal: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగిన పయనంలో ఒక్కసారిగా కాల్వ నీళ్లు ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు పిన్న వయస్కులు మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రమాదవశాత్తు తొలుత పావని (14) అనే చిన్నారి పంట కాల్వ నీటిలోకి దిగి మునిగి పోయింది. ఆమెను కాపాడాలనే ఆరాటంతో వెంటనే రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా నీటిలోకి దిగారు. అయితే కాల్వలో ప్రవాహం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ ఒక్కసారిగా గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కాపాడాలన్న ప్రయత్నంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు.
Also Read: NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!