Konidela Nagababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ముఖ్యమైన పదవి లభించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖకు చెందిన గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు ఆయనకు క్యాబినెట్ హోదాను కూడా కల్పించింది.
మంత్రవర్గంలో నాగబాబుకు చోటు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని లేదా రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సమీకరణాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, పార్టీ బలోపేతంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఆయన వహించిన కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
నేరుగా క్యాబినెట్ హోదా..
పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధి, హరిత కార్యక్రమాల పర్యవేక్షణలో గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. నేరుగా క్యాబినెట్ హోదా దక్కడంతో ఆయనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరిగింది. పొత్తు నిర్వహణతో పాటు పార్టీలో క్రియాశీలకంగా ఉంటూనే, ఈ నూతన పదవి ద్వారా పర్యావరణ రక్షణ రంగంలో తన సేవలను అందించే అవకాశం ఆయనకు లభించింది.
Also Read: జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!