BigTV English

KVP: జగన్‌తో దూరం ఎందుకంటే.. కేవీపీ క్లారిటీ!

KVP: జగన్‌తో దూరం ఎందుకంటే.. కేవీపీ క్లారిటీ!
kvp jagan

KVP: కేవీపీ. ఇప్పటి జనరేషన్‌కు ఈయన పెద్దగా తెలీకపోవచ్చు గానీ.. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగువెలిగారు. తెరమీదికంటే.. తెరవెనుక రాజకీయాలకే పరిమితమయ్యేవారు. రాజశేఖర్‌రెడ్డికి మంచి స్నేహితుడిగా, నమ్మిన వ్యక్తిగా మెదిలారు. కేవీపీ తన ఆత్మ అంటూ వైఎస్సారే ఓ సందర్భంలో చెప్పారంటే వారిద్దరూ ఎంత క్లోజో తెలుస్తుంది.


వైఎస్సార్‌కు నిత్యం వెన్నంటే ఉంటూ.. ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో కేవీపీ చక్రం తిప్పేవారని అంటారు. ఆయన్ని సంప్రదించకుండా వైఎస్ అసలేపనీ చేయరని చెప్పేవారు. అలాంటి కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత ఆ కుటుంబానికి దూరమయ్యారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం ట్రై చేస్తే కేవీపీ నుంచి మద్దతు లభించలేదు. తండ్రి పేరుతో జగన్ పార్టీ పెట్టినా.. ఆయన మాత్రం తన స్నేహితుడి కొడుక్కి మద్దతుగా నిలవలేదు. కాంగ్రెస్ పార్టీ జగన్‌ను టార్గెట్ చేసినా.. జగన్‌కు కేసులు చుట్టుకున్నా.. జైలు కెళ్లినా.. ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. తాను నమ్మిన కాంగ్రెస్‌కే కట్టుబడి ఉన్నారు.. ఇప్పటికీ ఉన్నారు.

వైఎస్సార్‌కి అంత సన్నిహితుడైన కేవీపీ.. ఆయన కుటుంబానికి ఎందుకు దూరమయ్యారనేది ఇప్పటికీ ఆసక్తికర విషయమే. జగన్‌కు అన్నీతానై కేవీపీ చక్రం తిప్పుతారని అనుకున్నారంతా. కానీ, వారిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. ఓ దశలో అప్పటి వైసీపీ నాయకురాలు కొండా సురేఖతో.. కేవీపీపై అవినీతి ఆరోపణలు కూడా చేయించారు జగన్. దాంతో వారి బంధం మరింత బీటలు వారింది. ఆ తర్వాత నుంచి వారిమధ్య పెద్దగా పలకరింపులు కానీ, సంప్రదింపులు కానీ జరగలేదు.


తాజాగా, జగన్‌కు తనకు మధ్య వచ్చిన దూరంపై కేవీపీ రామచంద్రరావు స్పందించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే ప్రశ్నల నుంచి ఇక ఎంతో కాలం దూరం జరగలేనని అన్నారు. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఒకరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం తానా విషయాన్ని వెల్లడించలేనని చెప్పుకొచ్చారు కేవీపీ.

Related News

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

Big Stories

×