E-Paper
Advertisement

AP Liquor Shops: మద్యం ప్రియులకు ఇక్కట్లేనా? వ్యాపారుల డిమాండ్స్ నెరవేరేనా? ప్రభుత్వం నో అంటే?

AP Liquor Shops: మద్యం ప్రియులకు ఇక్కట్లేనా? వ్యాపారుల డిమాండ్స్ నెరవేరేనా? ప్రభుత్వం నో అంటే?
Advertisement

AP Liquor Shops: ఏపీలో ఇకపై అలా చేస్తే చుక్కలేనంటూ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అది కూడా మందుబాబుల్లో ఫుల్ జోష్ పెంచే న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఎక్కడైనా అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగితే.. ఆ షాపు యజమానులపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారుల వాదన మాత్రం వేరేవిధంగా ఉంది.

ఎన్నికల సమయంలో మందుబాబులకు కూటమి వరాలు కురిపించింది. తక్కువ ధరకు మద్యాన్ని అందిస్తామని, బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే, సీఎం చంద్రబాబు నూతన మద్యం విధానంను ప్రవేశపెట్టారు. లాటరీ పద్దతిన మద్యం షాపు లీజుదారులను సైతం నియమించగా, ప్రభుత్వానికి ఈ పద్దతి ద్వారా ఆదాయం కూడా కోట్లల్లో వచ్చింది. మందుబాబులు మాత్రం ఫుల్ జోష్ గా ప్రభుత్వం మద్యంపై అవలంబిస్తున్న తీరు పట్ల ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ కొద్దిరోజులకే మద్యం వ్యాపారులు మాత్రం తమకు నష్టాలు వస్తున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

ఇందుకు వారి వాదన ఏమిటంటే.. తమకు ప్రతి మద్యం సీసాపై కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప, షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులకు ఇస్తున్న కమిషన్ ను వెంటనే పెంచాలంటూ ఇటీవల నిర్వహించిన మద్యం షాపులు, బార్ షాపుల యజమానుల సమావేశంలో పాల్గొన్న యజమానులు డిమాండ్‌ చేశారు. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Kakinada PDS Rice Sumggling: కాకినాడ పోర్టు చుట్టూ ఏపీ-తెలంగాణ రాజకీయాలు.. మరో కీలక పరిణామం

Advertisement

ఇలా వీరు డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం సీరియస్ యాక్షన్ కు దిగింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్‌ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నట్లు సమాచారం. అయినా తీరు మారకుండా రెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు మందుబాబులు, ఇటు ప్రభుత్వం మధ్యలో తాము నలిగిపోతున్నామని మద్యం వ్యాపారులు తెలుపుతున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×