E-Paper
Advertisement

Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Advertisement

Stock Market Investors: దేశీయ స్టాక్ మార్కెట్‌ రోజురోజుకూ దూసుకు పోతోందా? పెట్టుబడులు పెట్టే మదుపరులు ఏ రాష్ట్రానికి చెందినవారు? దేశీయ ఇన్వెష్టర్లా? విదేశీ పెట్టుబడుదారులా? ఇవే ప్రశ్నలు చాలామందిని కొన్నాళ్లుగా వెంటాడుతోంది. లేటెస్ట్‌గా మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేశీయ మదుపరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దేశీయ మార్కెట్‌లో రోజు రోజుకూ బుల్ జోరు కనిపిస్తోంది. కరోనా సమయంలో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలినా, ముంబైలోని దలాల్ స్ట్రీట్ మాత్రం కళకళలాడింది. పెట్టుబడుదారులకు మంచి లాభాలు వచ్చాయి. దీంతో విదేశీ మదుపరుదారులు సైతం బాంబే స్టాక్ మార్కెట్‌పై కన్నేశారు.

Advertisement

ఇంతకీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న మదుపరులు ఏ రాష్ట్రానికి చెందినవారు అధికంగా ఉన్నారు? ఏపీ లేదా తెలంగాణ ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి. ఎందుకంటే దక్షిణాది ప్రజల తెలివి తేటలకు తిరుగులేదని పలు సందర్భాల్లో నేతలు ఓపెన్‌గా చెబుతారు. స్టాక్ మార్కెట్‌లోనూ వీరిదే ఆదిపత్యమని చాలా మంది భావించారు.

మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. టాప్‌-10లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి మిగిలింది. అక్కడి ప్రజలు స్టాక్ మార్కెట్‌పై పెద్దగా దృష్టి సారించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Advertisement

ALSO READ:  స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

సౌత్ పరంగా చూస్తే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నాయి. కర్ణాటక ఆరో స్థానం, తమిళనాడు ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. టాప్‌లో మహారాష్ట్ర ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మార్కెట్‌లో స్టాక్స్‌ని ఏ రోజుకారోజు కొనుగోలు లేదా అమ్మకాలు జరిపినవారు కావచ్చు. పిల్లల కోసం పెట్టుబడులు పెట్టినవారు కావచ్చు.

ముంబై స్టాక్ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి 3 కోట్లకు పైగా ఇన్వెష్టర్లు ఉన్నారు. యూపీ నుంచి 2 కోట్లకు పైగానే మదుపరులు ఉన్నారు. గుజరాత్ కోటి 80 లక్షల మంది పెట్టుబడిదారులతో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం భూముల కొనుగోళ్లపై మొగ్గు చూపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మధ్య తరగతి కుటుంబాల్లో కొంతమంది ట్రేడింగ్‌పై అవగాహన లేక చేతులు కాల్చుకున్న సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ వైపు మొగ్గు చూపలేదన్నది మార్కెట్ విశ్లేషకుల మాట.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×