BigTV English
Advertisement

Madan Mohan – Vijayasai Reddy: శాంతి ఉదంతం మళ్లీ తెరపైకి.. లోకేష్ కు మదన్ మోహన్ ఫిర్యాదు.. సాయిరెడ్డిపై కూడా..

Madan Mohan – Vijayasai Reddy: శాంతి ఉదంతం మళ్లీ తెరపైకి.. లోకేష్ కు మదన్ మోహన్ ఫిర్యాదు.. సాయిరెడ్డిపై కూడా..

Madan Mohan – Vijayasai Reddy: వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విషయం ఇప్పుడు నేరుగా మంత్రి నారా లోకేష్ చెంతకు చేరింది. అది కూడా ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందగా, అక్రమాలకు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ లోకేష్ హామీ ఇచ్చారు. ఇంతకు ఈ వినతిపత్రం ఇచ్చింది ఎవరో తెలుసా.. సస్పెండ్ కు గురైన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్.


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా సస్పెండయిన కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ల మధ్య వివాదాలు మరింత ముదిరాయని చెప్పవచ్చు. మంగళవారం మదన్ మోహన్ ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాదర్భార్ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి లోకేష్ ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు.

తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. సమాజంలో ఎంపీ లాంటి ఉన్నత పదవిలో ఉన్న విజయసాయిరెడ్డి మాయమాటలతో, తన భార్యను లోబరుచుకుని తాను అమెరికాలో ఉన్న సమయంలో తన భార్యకు దగ్గరయ్యారని, అదే సమయంలో రూ.1500 కోట్ల విలువైన ఖరీదైన విశాఖ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.


గతంలో శాంతి భర్త మదన్ మోహన్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఏకంగా తన భార్యపై, విజయసాయిరెడ్డి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు. అయితే శాంతి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్త అన్నీ అవాస్తవాలే చెబుతున్నారని అందులో నిజం లేదంటూ తన ఆవేదన వెళ్లగక్కారు. అలాగే తన గురించి వ్యక్తిగత హననానికి దెబ్బతీసేలా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

తాజాగా లోకేష్ ను మదన్ మోహన్ కలిసి మరోమారు తన ఆవేదన వెళ్ళగక్కారు. గత కొంతకాలంగా విజయసాయి అక్రమాలపై ప్రశ్నిస్తున్నానని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని తనని హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని ఆరోపించారు. తాను ఐఐపీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని, వాళ్ల అక్రమాలకు అడ్డొస్తున్నానని తనని బలవంతంగా ఇక్కడినుంచి బదిలీ అయ్యేలా చేశారని ఆరోపించారు. 2023లోనే తనని అకారణంగా అమెరికా పంపించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని అన్నారు. తాను కుటుంబానికి దూరంగా ఉండటంతో విజయసాయి తన భార్యకు దగ్గరయ్యారని అన్నారు.

ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతి, ప్రధాని .హోం మంత్రి, డీజీపీని కూడా కలిశానని అన్నారు. ఈ విషయంలో తనకు ఇప్పటికైనా సత్వరమే న్యాయం జరిపించాలని కోరుతున్నానని అన్నారు. తన భార్య దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేసిందని, ఆ సమయంలో రూ.20 కోట్లకు పైగా అక్రమ సంపాదనకు ఒడిగట్టందని అన్నారు.

Also Read: Allu Arjun – Pawan Kalyan: నో అపాయింట్మెంట్.. అల్లు అర్జున్‌ను పవన్ దగ్గరికి రానివ్వడం లేదా.?

మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో ఉన్న రూ.3 కోట్ల విలువయిన ఇల్లు విశాఖ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్, విలాసవంతమైన కార్లు, కుంనపల్లిలో రూ.4 కోట్ల విలువయిన విల్లా ఇలా చాలానే అక్రమంగా తన భార్య సంపాదించుకున్నారని వినతిపత్రంలో వివరించారు. ఇదంతా విజయసాయి అండ చూసుకుని చేసిన నిర్వాకమే అన్నారు. స్పందించిన లోకేష్.. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×