E-Paper
Advertisement

TDP Central Office : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

TDP Central Office : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

TDP Central Office : ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో అనూహ్య మలుపు తీసుకుంది. ఈ మేరకు ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయాడు.

వైసీపీ ప్రభుత్వంలోనే…

వైసీపీ హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా 2021, అక్టోబర్ 19న కొందరు ఆ పార్టీ వ్యక్తులతో కలిసి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నానా హంగామా చేశారు. ఇది మంగళగిరిలో ఉంది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్ ,లేళ్ల అప్పిరెడ్డి , ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులే పార్టీ ఆఫీస్ పై దాడికి పూనుకున్నారన్న అభియోగాలు దాఖలయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీకి ప్రధాన అనుచరుడు…

వైసీపీ విద్యార్థి విభాగం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. చైతన్య వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

సోమవారం విచారణకు హాజరు…

వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సోమవారం ఈ కేసులో పోలీస్ విచారణకు హాజరయ్యారు. వీరిని మంగళగిరి రూరల్ పోలీసులు విచారించగా, దాడి జరిగిన రోజు వీరంతా ఉదయం ఎక్కడ కలిశారు, ఏఏ ప్రాంతాలను తిరిగారు లాంటి వివరాలను రాబట్టారు.

కేసు సీఐడీ చేతిలోకి…

పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ జోరు అందుకోవాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓవైపు తెలుగుదేశం కార్యాలయంపై దాడి, మరోవైపు ఆనాటి అపోసిషన్ లీడర్, నేటి ప్రభుత్వాధినేత సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను కలిపి సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో కేసు మంగళగిరి, తాడేపల్లి పోలీసుల నుంచి సీఐడీ చేతిలోకి వెళ్లింది. ఈ మేరకు కేసుల విచారణ ఫైళ్లను సీఐడీ చేతికి అప్పగించేశారు మంగళగిరి డీఎస్పీ. ఈ నేపథ్యంలోనే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పానుగంటి చైతన్య బయటకు వచ్చేశాడు. వెంటనే కోర్టులో లొంగిపోవడం గమనార్హం.

Also read : ఆ డ‌బ్బుల‌న్నీ ఏం చేశావ్ జ‌గ‌న్‌.. పల్లె పండుగలో పవన్ ప్రశ్న.. సినిమా గురించి కూడా

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×