TDP vs YSRCP: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయాంటూ విజయవాడలోని ముత్యాలపాడులో వైసీపీ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్రిక్తతలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంలో కూర్చొని ధర్నా చేస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ దీక్ష చేస్తున్న ప్రాంతంలో లోకేశ్ ప్లెక్సీని ఏర్పాటు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో.. ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.
దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను వారించి.. పరిస్థితులు చెక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన మల్లాది విష్ణుతో పాటు పలువురు వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి బలవంతంగా స్టేషన్ కు తరలించారు. అయితే మంత్రి నారా లోకేశ్ ప్రోద్భలంతోనే బోండా ఉమా.. దీక్షా శిబిరం వద్దకు చేరుకొని విధ్వంసానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.
అంతకుముందు పోలీసులు అరెస్టు సమయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గుండాయిజం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు శిబిరం వద్దకు వచ్చి దాడికి దిగడంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. మహిళలు అని చూడకుండా వైసీపీ నేతలను సైతం గాయపరిచారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ మహిళా కార్యకర్త ఘటనా స్థలిలోనే స్పృహ తప్పి పడిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Also Read: BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!
మరోవైపు బోండా ఉమా సైతం ఈ ఘటనపై స్పందించారు. వైసీపీకి ఇక్కడ నిరసన తెలిపే హక్కు లేదన్నారు. డీఎస్సీలో అవకతవకలు ఉంటే బహిరంగకు సిద్ధమని ఇప్పటికే లోకేశ్ ప్రకటించారని అన్నారు. ఆ సవాలుకు ఇంతవరకూ ఎవరూ స్పందించలేదన్నారు. అయితే దీక్ష మాటున తమ నేతలు చంద్రబాబు, లోకేశ్ లను తిడుతున్నారని.. అది చూసే ఇక్కడికి వచ్చానని అన్నారు. తమ నాయకులను బూతులు తిడితే తోలు తీస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.
Also Read: ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!