Tirumala Miracle: తిరుమలలో మహా అద్భుతం జరిగిందరి భక్తుల అంటున్నారు. తిరుమల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో జపాలి తీర్థం కలదు. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. అయితే అక్కడి ప్రదేశంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి కుళాయిలు ఎర్పాటు చేశారు. దీనిలో గత కొన్ని రోజులుగా కులాయిలో నుండి తెల్లటి నీరు వస్తుంది. దీంతో ఈ సంఘటన అక్కడి భక్తులను ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
జపాలి తీర్థం వద్ద నీరు తెల్లగా మారడంతో దైవానుగ్రహం వల్లే ఇలా నీరు పాల వలే తెల్లగా వస్తున్నాయిని కొందరు భక్తులు కొనియాడారు. తిరుమలలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తోందని భక్తులు తెలిపారు. తిరుమలలో గత కొన్ని రోజుల నుంచి నీరు ఇలానే వస్తోందని అక్కడి సిబ్బంది తెలిపారు.
Also read: Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!
తెల్లగా వచ్చిన నీటిలో రుచిలో ఇప్పడి వరకు ఎలాంటి మార్పురాలేదని అక్కడ పలువురు భక్తులు చెబుతున్నారు. దీంతో దీనిపై టీటీడీ అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పరీక్షించడానికి పంపిచారు.
Also read: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!