E-Paper
Advertisement

Nara Lokesh : టీడీపీ 6 శాసనాలు.. వైసీపీకి మైండ్ బ్లాక్..

Nara Lokesh : టీడీపీ 6 శాసనాలు.. వైసీపీకి మైండ్ బ్లాక్..
Advertisement

Nara Lokesh : టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదు.. అధికారం కూడా కొత్త కాదు. తెలుగు వాళ్లు ఇబ్బందుల్లో ఉంటే ముందుగా స్పందించేది తెలుగుదేశం పార్టీనే. కాలానికి తగ్గట్టే మార్పులు చేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా కార్యచరణ అమలు చేస్తోంది. అలాంటిదే మరో ప్రయత్నం. నా తెలుగు కుటుంబం అంటూ.. మహానాడులో ఆరు శాసనాలను ప్రతిపాదించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే టీడీపీ మౌళిక సూత్రానికి కట్టుబడుతూ.. సరికొత్తగా 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. మరో 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించేలా కీలక నిర్ణయాలపై మహానాడులో చర్చకు ఆహ్వానించారు నారా లోకేవ్.

టీడీపీ 6 శాసనాలు :

Advertisement

1. తెలుగుజాతి.. విశ్వ ఖ్యాతి

2. పేదల సేవలో.. సోషల్ రీఇంజనీరింగ్

Advertisement

3. స్త్రీ శక్తి

4. అన్నదాతకు అండగా..

5. యువగళం

6. కార్యకర్తే అధినేత

నాకు స్పూర్తి వాళ్లే..

టీడీపీలో పని చేసే వాళ్లకు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు నారా లోకేశ్. యువ శక్తికి సరైన ఉద్యోగా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. మెగా డీఎస్సీతో జూన్‌ నెలలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. స్త్రీ శక్తి ద్వారా పార్టీ పదవులతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు భద్రతా, బాధ్యత కల్పిస్తామని తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి మహిళా మంత్రి చీరా, గాజులు పంపిస్తానంటూ తనను ఎగతాళి చేసిందని ఆనాటి రోజా టాపిక్ గుర్తు చేశారు. అసెంబ్లీలో తల్లిని అవమానించిన చరిత్ర వైసీపీదన్నారు. సొంతం తల్లిని, చెల్లినే మెడపట్టుకుని బయటకు గెంటేశారంటూ జగన్‌ను విమర్శించారు. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు.. ఇంటి నుంచే మార్పు రావాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, బలంగా అన్నారు నారా లోకేశ్. మంజుల, తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతలే తనకు స్పూర్తి అన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×