BigTV English
Advertisement

Nellore Bus Accident: నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Nellore Bus Accident: నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Nellore Bus Accident: తిరుపతి జిల్లాలో నారాయణ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. బోడిలింగాలపాడు వద్ద బస్సు అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.


వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలోని బోడి లింగాల పాడు జాతీయ రహదారిపై.. నారాయణ స్కూలు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ బస్సులో మొత్తం 30 మంది విద్యార్ధులు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిచి చికిత్స నిమిత్తం సూళ్లూరిపేట తడ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమి లేకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు కూడా కొంచెం పాతగా ఉండడం, బ్రేకులు కూడా సరిగ్గా పడకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్లు.. కొంత మంది స్టూడెంట్స్ చెబుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం సమీపంలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా.. ఆర్టీవో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. డ్రైవర్, ఆర్టీవో అధికారులపై పేరెంట్స్ పోలీసులు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే.. అంబర్‌పేట్‌లో నలుగరు విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ వీడటం లేదు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ, కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, కోరే హర్ష వర్ధన్ అనే నలుగురు విద్యార్థులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతూ దొరకడంతో టీచర్ మందలించి…పేరెంట్స్ కి విషయం చెప్పింది.

Also Read: వరంగల్‌‌లో దారుణం.. నడి రోడ్డుపై డాక్టర్ ను ఇనుపరాడ్లతో కొట్టి.. ఆపై హత్యాయత్నం

పేరెంట్స్ కూడా మందలించడంతో నలుగురు కలిసి ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తలిదండ్రులు.. అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×