E-Paper
Advertisement

Anantapur : అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి..

Anantapur : అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి..
Advertisement

Anantapur : బైకు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ అతని స్నేహితులు శనివారం ధర్మాపురం నుంచి గుంతకల్ కు ద్విచక్ర వాహనం మీద బయలుదేరారు. నక్కన దొడ్డి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×