Big Stories

Anantapur : అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి..

Anantapur : బైకు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు.

- Advertisement -

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ అతని స్నేహితులు శనివారం ధర్మాపురం నుంచి గుంతకల్ కు ద్విచక్ర వాహనం మీద బయలుదేరారు. నక్కన దొడ్డి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News