E-Paper
Advertisement

AP Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోనే డబ్బులు జమ

AP Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోనే డబ్బులు జమ

AP Pensions: మే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల వృద్దులు పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు.

బ్యాంక్ ఖాతాలు లేనివారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మే ఒకటి నుంచి 5 లోపు ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో.. ఈ మార్పులు చేశారు.

అయితే రాష్ట్రంలో మొత్తంగా 64,49,854 మంది పెన్షనర్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, వీరిలో 75 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది నేరుగా అందించనున్నారు. సచివాలయ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లు లేనివారి ఇంటి వద్దకే వెళ్లి నేరుగా అందించనున్నారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×