E-Paper
Advertisement

AP Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోనే డబ్బులు జమ

AP Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోనే డబ్బులు జమ
Advertisement

AP Pensions: మే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల వృద్దులు పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు.

బ్యాంక్ ఖాతాలు లేనివారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మే ఒకటి నుంచి 5 లోపు ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో.. ఈ మార్పులు చేశారు.

Advertisement

అయితే రాష్ట్రంలో మొత్తంగా 64,49,854 మంది పెన్షనర్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, వీరిలో 75 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది నేరుగా అందించనున్నారు. సచివాలయ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లు లేనివారి ఇంటి వద్దకే వెళ్లి నేరుగా అందించనున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×