E-Paper
Advertisement

Ambati Rambabu: పోలీసులకు హింట్ ఇచ్చి మరీ.. అలా చేశారేంటి.. అంబటి చేసిన నిర్వాకానికి వైసీపీ షాక్..

Ambati Rambabu: పోలీసులకు హింట్ ఇచ్చి మరీ.. అలా చేశారేంటి.. అంబటి చేసిన నిర్వాకానికి వైసీపీ షాక్..
Advertisement

Ambati Rambabu: ఏమయ్యా అంబటి గారూ.. అంత పని చేశావు. ఇంతకు మన పార్టీ అధికారంలో ఉందనుకున్నావా ఏంటి? మన పార్టీ వాడిని నువ్వే దగ్గరుండి మరీ, పోలీసులకు పట్టించావు. అలా సవాల్ విసరడం ఎందుకు? దాగి ఉన్న అతడి రహస్యం చెప్పడమెందుకు? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు అంటున్నారట సొంత పార్టీ నేతలే.

ఇంతలా మాజీ మంత్రి అంబటి రాంబాబు ను కామెంట్ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు. అందులో ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పై ఓ కన్నేసి మరీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Advertisement

ఈ తరహాలోనే పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన సమయం నుండి, రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు సైతం సాగిస్తున్నారు. నాలుగు రోజులుగా ముప్పు తిప్పలు పెట్టిన రాజశేఖర్ రెడ్డి కోసం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కూడా వెతుకుతున్నారు పోలీసులు.

అంతలోనే మాజీ అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ప్రకటన, పోలీసుల శ్రమను తగ్గించింది. అంబటి ఏమన్నారంటే.. పోలీసులు వెతుకుతున్న రాజశేఖర్ రెడ్డి తన సమక్షంలో భద్రంగా ఉన్నాడని, దమ్ముంటే పోలీసులు అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ పోలీసులకు హింట్ ఇచ్చినట్లయింది.

Advertisement

ఇక రంగంలోకి దిగిన పోలీసులు మనసులో అంబటి కి థ్యాంక్స్ చెప్పుకొని, ఆయన కార్యాలయం వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ పోలీసులకు, అంబటి వాగ్వివాదం కూడా సాగింది. సరైన ఆధారాలు చూపించి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంబటి డిమాండ్ చేస్తున్న తరుణంలో పోలీసులు మాత్రం అతడిని ఎంచక్కా పోలీస్ జీప్ ఎక్కించేశారు.

Also Read: Rajini Vidadala: RRR కేసును తలపించేలా మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు? ఎస్పీకి ఫిర్యాదు చేసిన భాదితులు

పోలీసులు చేసిన ఈ అరెస్ట్ చూస్తే, చివరికి అంబటి రాంబాబు హింట్ ఇచ్చి మరీ రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కి సహకరించినట్లయింది. అందుకే ఆవేశం పనికి రాదు అంబటి గారూ.. తొందరపడి సవాల్ విసిరారు.. పోలీసులు అరెస్ట్ చేశారు.. ఏమి సాధించారంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×