E-Paper
Advertisement

Ambati Rambabu’s Brothers: దొరికిపోయిన అంబటి సోదరులు, ఆపై కేసు.. ఏం జరిగింది?

Ambati Rambabu’s Brothers: దొరికిపోయిన అంబటి సోదరులు, ఆపై కేసు.. ఏం జరిగింది?
Advertisement

Ambati Rambabu’s Brothers: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి చెప్పనక్కర్లేదు. సూటిపోటి మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఆయన దిట్ట. ఆయన మాటలే కాదు.. చేసే పనులూ అలాగే ఉంటాయి. లేటెస్ట్‌గా అంబటి రాంబాబు, ఆయన సోదరుడు అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ విషయం ఏంటన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

వైసీపీలో ఫైర్‌ బ్రాండ్ అనగానే గుర్తొచ్చే వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. తన మాటలతో ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెట్టడంతో ఆయనకు తిరుగులేదని అంటుంటారు. ఒక్కోసారి ఆయా బాణాలు రివర్స్ అయినా ఏ మాత్రం చలించరాయన.

Advertisement

మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీకృష్ణపై కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు అంబటి సోదరులపై కేసు నమోదు చేశారు. వైసీపీ రూలింగ్‌లో భజరంగ్ జూట్‌ మిల్లు స్థలాలు విక్రయం, గ్రీన్ గేస్ అపార్టుమెంట్ అక్రమ నిర్మాణాలు చేశారు. వాటిపై పోరాటం చేస్తున్నారు బాధితులు.

వారికి అండగా నిలిచారు కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబురావు. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. ఫలితంగా బాబురావుకు అంబటి సోదరుల నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి.

Advertisement

ALSO READ:  నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం

చివరకు రక్షణ కోసం ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. జరిగిన విషయాన్ని న్యాయస్థానానికి వివరించారు. అంబటి సోదరులపై చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో గుంటూరులోని నగరపాలెం పోలీసులు అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళిపై కేసు నమోదు చేశారు. దీంతో అంబటి వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×