E-Paper
Advertisement

Posani latest comments: నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర.. టీడీపీలోకి రమ్మన్నారు.. పోసాని కలకలం..

Posani latest comments: నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర.. టీడీపీలోకి రమ్మన్నారు.. పోసాని కలకలం..
Advertisement
Posani latest press meet

Posani latest press meet(Latest political news in Andhra Pradesh):

అసలే పోసాని. నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. అలానే నారా లోకేశ్‌పై అనేక విమర్శలు చేశారు. పోసాని వ్యాఖ్యలకు లోకేశ్ హర్ట్ అయ్యారు. ఆయనపై రూ.4 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తనపైనే కేసు వేస్తారా? అంటూ పోసాని మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈసారి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు.

తనను చంపాలని నారా లోకేష్‌ కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేత, ఏపీ FDC చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆరోపించారు. పరువునష్టం కేసు వేసి.. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని.. తాను వెళ్లినప్పుడు చంపాలని ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. ఒకవేళ తాను చనిపోతే.. అందుకు నారా లోకేష్‌దే బాధ్యత అని హెచ్చరించారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

Advertisement

లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్‌ చేశాడని.. టీడీపీలోకి రమ్మని ఆహ్వానించాడని.. మరో బాంబు పేల్చారు పోసాని. అయితే, తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. జీవితాంతం వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు పోశాని కృష్ణమురళి.

చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారన్నారు. కంతేరులో 14 ఎకరాల భూమి లోకేశ్ కొన్నారని తాను అన్నానని పరువు నష్టం దావా వేశారని.. హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌వి కావా? అని ప్రశ్నించారు పోసాని. అసలు లోకేష్‌ ఇంతవరకూ ఎవరిపై విమర్శలు చేయలేదా? సీఎం జగన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన లోకేశ్‌పై పరువునష్టం దావా వేయకూడదా? అని నిలదీశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×