BigTV English

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Prakasam district: తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేశాడో వ్యాపారి. అప్పు చెల్లంచక పోతే.. నీ కుమార్తెను చంపుతానంటూ ఆ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి బాలికను సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.


ALSO READ: జరిగింది ఇదే..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన శ్రీనివాసరావు.. గతంలో పని కోసం తిరుపతికి వలస వెళ్లాడు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. అయితే అక్కడ కుటుంబం కోసం డబ్బులు అవసరం ఏర్పడింది. అప్పు కోసం ఈశ్వర్‌రెడ్డిని సంప్రదించాడు. దీంతో ఈశ్వర్‌రెడ్డి శ్రీనివాసరావుకు సుమారు రూ.5లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. పని చేసుకుంటూనే శ్రీనివాసులు అప్పుగా తీసుకున్న డబ్బును కొంతమేర చెల్లించాడు. జీవనం భారం కావడంతో తిరుపతి నుంచి శ్రీనివాసరావు మువ్వవారిపాలెం వచ్చేశాడు. అప్పటి నుంచి ఈశ్వర్‌రెడ్డికి అందుబాటులో లేడు. దీంతో.. శ్రీనివాసరావుకు కూతురు ఉందని, తను చీమకుర్తిలో చదివే స్కూల్‌ లో చదువుతుందని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళిన ఈశ్వర్ మీ నాన్న ఇంటికి తీసుకురమ్మన్నాడంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు.


ALSO READ: Eesha Rebba: చిలిపి ఫోజులతో కొంటెగా కవ్విస్తున్న ఈషా రెబ్బ.. ఫోటోలు వైరల్!

స్వీట్లు కొనిస్తానని చెప్పి ఒంగోలుకు తీసుకొచ్చాడు ఈశ్వర్‌రెడ్డి. ఆ తర్వాత శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళ్తున్నానని అప్పు చెల్లించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. భయాందోళన చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్కూల్ వద్దకు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటే జీ ఆధారంగా కిడ్నాపర్‌ తిరుపతికి చెందిన ఈశ్వర్‌ రెడ్డిగా గుర్తించారు. వెంటనే అతడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కావలి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిడ్నాపైన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అదుపులో తీసుకున్న ఈశ్వర్ రెడ్డిని విచారిస్తున్నారు. శ్రీనివాసరావును కూడా విచారించి ఈకేసును పరిస్కరిస్తామని పోలీసులు తెలిపారు.

Related News

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

Big Stories

×