E-Paper
Advertisement

Weather Updates: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..

Weather Updates: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..
Advertisement

Rain updates in AP: మండే ఎండలతో ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విజయవాడలో శుక్రవారం రాత్రి గంటకుపైగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గుంటూరు, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, తిరుపతితోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో 79 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే, పలు ప్రాంతాల్లో మాత్రం పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. కేరళ మీదుగా ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో ద్రోణి ఏర్పడే అవకాశముంది.. ఈ కారణంగానే రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?

Advertisement

విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ క్రమంలో ఇటు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×