E-Paper
Advertisement

Weather Updates: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..

Weather Updates: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..
Advertisement

Rain updates in AP: మండే ఎండలతో ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విజయవాడలో శుక్రవారం రాత్రి గంటకుపైగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గుంటూరు, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, తిరుపతితోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలో 79 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే, పలు ప్రాంతాల్లో మాత్రం పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. కేరళ మీదుగా ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో ద్రోణి ఏర్పడే అవకాశముంది.. ఈ కారణంగానే రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?

Advertisement

విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ క్రమంలో ఇటు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×