Joy Ride Accident: మహరాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. జాంఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిమిషన్ లో సునామీ జాయ్ రైడ్ ఎక్కిన ఓ యువతి.. ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో అప్పటివరకూ ఎగ్జిమిషన్ లో సంతోషంగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జాంఖేడ్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన ‘సునామీ కార్నివాల్ రైడ్’ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైడ్ వేగంగా తిరగడం ప్రారంభం కాగానే.. యువతి కూర్చున్న సీటుకు ఉన్న ఐరన్ సేఫ్టీ లాక్ ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా యువతి గాల్లోకి ఎగిరి అమాంతం కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
మహారాష్ట్ర: భద్రతా లాక్ విఫలం కావడంతో జాతరలో రైడ్ నుండి కిందపడిన బాలిక pic.twitter.com/iTcMEtL4Ld
— ఉదయం (@udayamdigital) August 24, 2026
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గాయాల పాలైన యువతిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎత్తు నుంచి కింద పడటం వల్ల ఆమె శరీరానికి తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా రైడ్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కొండాకు మరో క్షమాభిక్ష..? ఖర్గేతో రాయబారం ఫలించినట్టేనా..? సీఎం వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా?
అయితే స్థానిక జాతరలు, మేళాల సమయంలో ఇలాంటి జాయ్రైడ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే సరైన నిర్వహణ, అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.
Also Read: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు