E-Paper
Advertisement

Araku Road Accident : అరకులోయలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Araku Road Accident : అరకులోయలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement
Araku valley road accident
Araku valley road accident

Road Accident in Araku Valley(Local news andhra Pradesh): మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరకు వెళ్లి వస్తూ.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అరకులోయలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ – లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి.. తిరిగి వస్తున్న రెండు బైక్ లను అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీ కొట్టింది.

Read More : ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి

Advertisement

అరకులోయ మండలం గన్నెల రహదారిలో గల మాదల పంచాయతీ నందివలస వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), లోతేరుకు చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4)లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×