E-Paper
Advertisement

AP EC Meena: ఏపీ ఎలక్షన్ హిస్టరీలో ఓ రికార్డు.. మనీ, బంగారం, డ్రగ్స్ అన్నీ కలిసి..

AP EC Meena: ఏపీ ఎలక్షన్ హిస్టరీలో ఓ రికార్డు.. మనీ, బంగారం, డ్రగ్స్ అన్నీ కలిసి..
Advertisement

AP EC Meena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలంటే చాలు.. ధన ప్రవాహం ముందుగా గుర్తుకు వస్తుంది. ఎన్నికల్లో గెలవాలంటే భారీ ఎత్తున ఖర్చు చేయాల్సిందేనని నేతలు ఒక్కోసారి నిజాలు ఓపెన్‌గా చెబుతుంటారు. తాజాగా ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా కీలక విషయాలను వెల్లడించారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నుంచి ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 141 కోట్ల రూపాయాలు సీజ్ చేసినట్టు ప్రకటించారు. ఇందులో మనీ, బంగారం, డ్రగ్స్, చీరలు, గడియాలు, క్రికెట్ కిట్లు ఇతర వస్తువులున్నట్లు వెల్లడించారు.

2019 ఎన్నికల్లో పట్టుబడిన దానికంటే ఇది రెండు రెట్లు అధికమని చెప్పుకొచ్చారు ఏపీ ఎన్నికల అధికారి. అంతేకాదు ఎన్నికలకు ముందు ఈ స్థాయిలో స్వాధీనం చేసుకోవడం ఓ రికార్డుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంపై ఎన్నికల సంఘం ఓ కన్నేసిందన్నారు. ఈసీ చెబుతున్న ప్రకారం పరిశీలిస్తే.. ఎన్నికల పోలింగ్ నాటికి
మరింత నగదు, నగలు పట్టుబడడం ఖాయమన్నమాట.

Advertisement

ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని కుండబద్దలు కొట్టేశారు ఎన్నికల అధికారి మీనా. ముఖ్యంగా ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడమే తమ ధ్యేమన్నారు. ఎన్నికల ఆఫీసులో ఏర్పాటు చేసిన న్యూ టెక్నాలజీ సాయంతోనే ఇదంతా సాధ్యమైనట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి, ఉల్లంఘనలు, మద్యం, డబ్బు, బంగారం అక్రమ రవాణాపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

ALSO READ: ఎన్నికల వేళ వారికి షాక్.. ఇద్దరిపై బదిలీ వేటు..

Advertisement

అలాగే 424 అంతర్ రాష్ట్ర సరిహద్దులు, 358 చెక్ పోస్టులలో అటు ఇటూ వచ్చే వాహనాల కదలికలపై వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓటర్లపై మద్యం ప్రభావం ఉండకూడదనేది ముఖ్య ఉద్దేశమన్నారు. మద్యం సరఫరా చేసే వాహనాలకు శాటిలైట్ ట్రాకింగ్ అమర్చినట్టు తెలిపారు. అక్రమ రవాణా నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం మరో రెండువారాలు మాత్రమే ఉంది. మే 11న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×