BigTV English
Advertisement

CM Chandrababu Naidu: రామానాయుడి స్టూడియో భూములపై.. చంద్రబాబు సంచలన నిర్ణయం

CM Chandrababu Naidu: రామానాయుడి స్టూడియో భూములపై.. చంద్రబాబు సంచలన నిర్ణయం

విశాఖపట్నంలో వివాదాస్పద భూములు దసపల్లా, హైగ్రీవ, రామానాయుడు స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, స్వరూపానంద భూములను పరిశీలించారు సిసోడియా. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూములు 13 లక్షల ఎకరాలు ఉంటే 25 వేల ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేశారు. విశాఖపట్నంలో దాదాపుగా 2600 ఎకరాల భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ జరిగినట్టు గుర్తించారు. 606 ఎకరాలను 22A నుంచి తొలగించారు. 133 ఎకరాలు కొత్త వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు మండలాల్లో భూదందా జరిగినట్టు గుర్తించారు సిసోడియా.

ఫ్రీహోల్డ్ భూముల అగ్రిమెంట్లు జరిగి, రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య తెలియని స్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో అనాథరైజ్డ్ లేఅవుట్ చాలా ఎక్కువగా ఉన్నాయని, ఎర్రమటి దిబ్బలను కొంత వరకు లెవెల్ చేశారని, ఒకటి రెండు వాగులను కప్పేశారని గుర్తించారు. భూ అక్రమాలను సహించేది లేదని సిసోడియా పేర్కొన్నారు.


Also Read: తిరుపతి అగ్ని ప్రమాదంపై అనుమానం.. టీటీడీలో రూ.100కోట్లు చేతులు మారాయి.. వైసీపీ పనే!

విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై కొన్ని లోపాలు గుర్తించారు సిసోడియా. 22A, ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. అవి ఎవరి పేరున రిజిస్టర్ అయ్యాయో గుర్తించగలం కానీ దాని వెనుక ఎవరు ఉన్నారనేది చెప్పలేమని సిసోడియా తెలుపుతున్నారు. దసపల్ల భూముల యాజమాన్య హక్కులపై వివాదం వుందని.. అందులోనే సర్క్యూట్ హౌస్, ఇతర ప్రభుత్వ నిర్మాణాలు వున్నాయన్నారు. 14 ఎకరాలు మాత్రం 22Aలో పెట్టామని తెలిపారు సిసోడియా.

దసపల్లా భూములపై న్యాయ పరిధిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం చూస్తోందని.. నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం డిజిటల్ మ్యాపింగ్ చెయ్యాలన్నారు సిసోడియా. రెవిన్యూ రికార్డులకు, మున్సిపల్ రికార్డులకు మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని.. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్రమట్టి కొండలు లేఅవుట్‌ స్టేటస్‌ కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలు రెండు వాగులను కప్పేశారని తెలిపారు. మొత్తంమీద విశాఖ ఉత్తరాంధ్రలో రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ RP సిసోడియా పర్యటనతో భూకబ్జాలకు పాల్పడ్డ ఆక్రమణదారుల్లో కేసుల భయం మొదలైంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×