E-Paper
Advertisement

RTC: ఆర్టీసీకి ‘సన్’ స్ట్రోక్.. రాబడిలో బిగ్ మైనస్..

RTC: ఆర్టీసీకి ‘సన్’ స్ట్రోక్.. రాబడిలో బిగ్ మైనస్..
Advertisement

RTC: ఏపీలో వర్షాలు పడుతున్నాయి కానీ.. ఇప్పటి వరకు మాడు పగిలింది. జనం సంగతి ఎలా ఉన్నా.. ఏపీఎస్‌ఆర్టీసీకి వడదెబ్బ తగిలింది. ఎండ తీవ్రతకు జనం బయటకు రాకపోవడమే అందుకు కారణం. భానుడి భగభగలతో బయటకు వెళ్లాలంటేనే జనం జడుసుకున్న పరిస్థితి. వేడి సెగలను తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఫలితంగా బస్సుల్లో సీట్లు ఖాళీ. ప్రయాణికుల సంఖ్య ఎంతలా పడిపోయిందంటే.. ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 15.47 శాతం తగ్గిపోయింది. రోజువారీ టికెట్ కలెక్షన్ ఆదాయంలో 4 కోట్ల రూపాయలకు పైగా తేడా వచ్చింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసినవాళ్లు.. సొంత వాహనాల్లో లేదంటే ఏసీ వెహికల్స్‌ను ఆశ్రయించారు. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్టున్నారు. సాధారణంగా పరీక్షల సమయంలో ప్రతి ఏటా ఆక్యుపెన్సీ రేషియో తగ్గడం.. రాబడిలో కోత పడడం కామనే అయినా.. ఈసారి ఇంత పెద్ద లోటు ఉంటుందన ఊహించలేకపోయారు.

Advertisement

ఏపీఎస్ ఆర్టీసీ.. నిత్యం 11 వేల బస్సులు నడుపుతుండగా.. ఒక్కో బస్సుకి యావరేజ్‌గా 16 వేల 416 రూపాయల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం 13 వేల 751 మాత్రమే వస్తోంది. అంటే ఒక్కో బస్సుపై రోజూ 2 వేల 665 రాబడి తగ్గినట్టు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో​ 61 శాతంగా ఉండేది. వాస్తవానికి 76.4 శాతం ఉండాలి. కనీసం 70 శాతమైనా వస్తుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అనుకున్న లక్ష్యం కంటే 15.47 శాతం తగ్గింది. వరుసగా రెండు నెలలుగా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.

గతేడాది ఆర్టీసీ వరుసగా రెండు సార్లు ఛార్జీలు పెంచడంతో టిక్కెట్ల రూపంలో రాబడి రోజుకు సగటున 18.32 కోట్లకు చేరింది. అటుఇటుగా 17 కోట్లపైనే వచ్చేది. ఏప్రిల్‌లో రోజవారీ ఆదాయం 14 కోట్లకు తగ్గిపోయింది. లక్ష్యం కంటే 4.25 కోట్ల రూపాయలు పడిపోయినట్టు. సంస్థ రాబడిలో 25 శాతం మేర ప్రతినెలా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఆదాయం తగ్గడంతో.. సర్కారుకు చెల్లించే మొత్తం కూడా తగ్గింది. ఎందుకిలా జరిగిందని ఆర్థికశాఖ ఆరా తీసినట్లు సమాచారం. పరీక్షల సమయం కావడం, పెళ్లిళ్లు, శుభకార్యాల ముహూర్తాలు లేకపోవడంతో ఆక్యుపెన్సీ రేషియో పడిపోయిందని అధికారుల సమాధానం. ఇప్పుడు ఆశలన్నీ పెళ్లిళ్ల సీజన్‌పైనే. తమ గల్లాపెట్టెకూ పెళ్లి కళ వస్తుందని అధికారుల ఆశాభావం.

Advertisement

ఆదాయం లోటును భర్తీ చేసేందుకు కొత్త మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. శ్రీశైలం, అరుణాచలం, తిరుపతికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×