E-Paper
Advertisement

Chandrababu Speech: అన్ని వర్గాలకు అనుకూలంగా కూటమి మేనిఫెస్టో.. పేదలకు ఇళ్ల స్థలాలు: చంద్రబాబు!

Chandrababu Speech: అన్ని వర్గాలకు అనుకూలంగా కూటమి మేనిఫెస్టో.. పేదలకు ఇళ్ల స్థలాలు: చంద్రబాబు!
Advertisement

Chandrababu Speech in Jaggampet Prajagalam Sabha: ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వసం సృష్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు.

కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్విహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. మద్యం నిషేధం చేసిన తర్వాతనే ఓటు వేయండంటూ అడుగుతానన్న సీఎం జగన్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాటల నిలబెట్టుకున్నారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement

ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఆఖరికి చిన్న టీ కొట్టులోనూ ఆన్ లైన్ పేమెంట్ చేస్తుంటే.. మద్యం దుకాణాల్లో ఎందుకు ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ పెట్టలేదని వైసీపీని చంద్రబాబు నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో జగన్ ఉద్యోగులకు మాటిచ్చారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ యువతకు మాటిచ్చారు.. ఇప్పుడు ఆ హామీలన్నీ ఎక్కడికి పోయాయన్నారు.

Also Read: AP Congress List: 38 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల..

Advertisement

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగలేదని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత భారీగా పెరిగాయన్నారు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ పైనే ఉంటుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా టీడీపీ మేనిఫెస్టే తయారు చేశాం అని చంద్రబాబు జగ్గంపేట సభలో వెల్లడించారు.

మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని మరోసారి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికీ వచ్చి రూ.4 వేలు ఫించను అందిస్తామన్నారు. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేసే బాధ్యత తనదని వెల్లడించారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×