Big Stories

Chandrababu: సీఎంపై రాయి దాడి..‘ బీ కేర్ ఫుల్ ఆఫీసర్స్’.. చంద్రబాబు మాస్ వార్నింగ్

Chandrababu naidu news today(Latest news in Andhra Pradesh): సీఎం జగన్ రాయి దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం నీచమైన డ్రామాలు చేస్తోందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. ఈ దాడి ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

సీఎం జగన్ కుట్రలు చేస్తూ.. దాడి ఘటనలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీనే ఈ దాడి చేసిందనేలా వైసీపీ డ్రామాలకు పాల్పడుతుందన్నారు. టీడీపీపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. వాటిని చీదరించుకుంటున్నారని తెలిపారు. ఈ కేసులో వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖతో తప్పులు చేయిస్తోందని చంద్రబాబు అన్నారు. విజయవాడలో బోండా ఉమా చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు కేసులు పెట్టి వైసీపీ అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Chandrababu naidu news today
Chandrababu

ఈ దాడి కేసులో నిందితులంటూ వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులను పోలీసులు తీసుకుపోయారని చంద్రబాబు తెలిపారు. నిజానికి వారంతా అమాయకులని చంద్రబాబు వెల్లడించారు. బలవంతంగా వారి చేత టీపీడీనే ఈ దాడి చేయించిందని చెప్పేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను వేరే వాళ్లకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Also Read: అప్పుడు కత్తి.. ఇప్పుడు రాయి.. కథేం మారలేదా?

అధికారులు వైసీపీ ప్రభుత్వం ప్రలోభాలకు లొంగొద్దని, ఒత్తిళ్లకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అలా వైసీపీకి సహకరించిన వారిని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుకుండా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసుపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని.. వేరే అధికారులతో ఈ దాడి ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News