E-Paper
Advertisement

JC Prabhakar Reddy: ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్

JC Prabhakar Reddy: ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్
Advertisement

JC Prabhakar Reddy Warning to Tipper Drivers: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకునే వారికి ఇసుకను ఫ్రీ గా సప్లై చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. అయితే ఇల్లు కట్టుకునేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అందుకు కొన్ని నియమ, నిబంధనలను విధించింది. ఇసుక ఫ్రీ నే.. కానీ.. డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో జరుగుతున్న ఇసుక దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయనొక వీడియో విడుదల చేశారు.

తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారని, వారంతా వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఇసుక దందా చేస్తున్నవారంతా తనకు ఆప్తులేనని, పార్టీకోసం ఐదేళ్లు తన వెన్నంటే ఉండి కష్టపడ్డారని, డబ్బుకోసం ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు. ఇసుక దందా గురించి తానెంతో పోరాడానని, ఎంతో నష్టపోయానని చెప్పుకొచ్చారు. అలాంటి తన ఆప్తులే ఇసుక దందా చేస్తుండటం ఏం బాగలేదన్నారు. కొప్పూరులో ఆదివారం ఏసీబీ వాళ్లు ఎంక్వైరీకి వచ్చారని, దందా చేసి.. అనవసరంగా చిక్కుల్లో పడొద్దని తెలిపారు.

Advertisement

Also Read: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే..అన్న క్యాంటీన్లపై ఫేక్ ప్రచారం మంత్రి నారా లోకేశ్ కౌంటర్

అలాగే తన నియోజకవర్ంలో ఇసుక లోడుతో బండ్లు తోలితే.. వాటిని బయటికి కూడా రానివ్వనంటూ టిప్పర్ ఓనర్లను, డ్రైవర్లను హెచ్చరించారు. పార్టీకోసం కష్టపడి చాలా పోగొట్టుకున్నానని, అలాగని ఇసుక దందా చేస్తున్నానా ? అని హెచ్చరించారు. 2,50,000 మంది ఓటర్లున్న నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారని, వారంతా ఎవరిని ఉపయోగించుకుని ఇసుక అమ్ముకుంటున్నారో తనకు బాగా తెలుసన్నారు జేసీ. ఇకనైనా అలాంటి పనులు మానుకోవాలని, కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తానని తెలిపారు. ఇలాంటి పనులు చేసి పార్టీకి, తనకు దూరం కావొద్దని కోరారాయన.

Advertisement

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×