E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దీపావళి ఆస్థానానికి ఏర్పాట్లు.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దీపావళి ఆస్థానానికి ఏర్పాట్లు.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Advertisement

Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది. అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు.

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 64447 మంది భక్తులు దర్శించుకోగా.. 25555 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.38 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 7 కంపార్ట్ మెంట్ లలో భక్తులు, స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు.

Advertisement

నేడు టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల..
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి అందుకు సంబంధించిన దర్శనం టికెట్లను నేడు ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

Also Read: Horoscope 24 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇలా చేస్తే ఇంకా బెటర్!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×