E-Paper
Advertisement

TTD Update: శ్రీవారి భక్తులకు కొత్త ఏడాది కానుకలు సిద్దం.. ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు

TTD Update: శ్రీవారి భక్తులకు కొత్త ఏడాది కానుకలు సిద్దం.. ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు
Advertisement

TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది సందర్భంగా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం కొత్త ఏడాదికి టీటీడీ ఆధ్వర్యంలో డైరీలు, క్యాలెండర్ ను అందించడం ఆనవాయితీ. ఆ సందర్భంగా ఆంగ్లనామ సంవత్సరం 2025 డైరీలను సైతం టీటీడీ సిద్ధం చేసినట్లు చైర్మన్ బీ.ఆర్ నాయుడు తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అందించే డైరీలను క్యాలెండర్లను అందుకునేందుకు భక్తులు అమిత ఆసక్తి చూపుతారు. అందుకే ప్రతి ఏడాది టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాలెండర్లను, డైరీలను భక్తులకు అందించేందుకు సిద్ధం చేస్తారు. ఈ ఏడాది కూడా టీటీడీ ఆధ్వర్యంలో 2025 డైరీలను క్యాలెండర్లను అందించినట్లు చైర్మన్ బీ.ఆర్ నాయుడు ప్రకటించారు.

Advertisement

AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి

ఈ డైరీలు, క్యాలెండర్లను పొందేందుకు భక్తులు ఆన్లైన్ ద్వారా సైతం పొందేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ తెలిపారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్, సింగల్ షీట్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను భక్తులకు అందుబాటులో టీటీడీ ఉంచింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు ఇతర ప్రాంతాల్లో విక్రయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని టీటీడీ ప్రకటించింది.

Advertisement

ఇక ధరల విషయానికి వస్తే పెద్ద డైరీలు రూ. 150, చిన్న డైరీ రూ.120, 12షీట్ల క్యాలండర్ రూ. 130, టేబుల్ టాప్ క్యాలండర్ ఒకటి రూ. 75 ధరలుగా నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×