BigTV English
Advertisement

AP Politics : ఒకే జైల్లో, ఒకే బ్యారక్‌లో బద్ధ శత్రువులు.. రిటర్న్ గిఫ్ట్ అదుర్స్!

AP Politics : ఒకే జైల్లో, ఒకే బ్యారక్‌లో బద్ధ శత్రువులు.. రిటర్న్ గిఫ్ట్ అదుర్స్!

AP Politics : రాజకీయ నేతలు, పోలీసుల మధ్య అదో రకమైన బంధం ఉంటుంది. కుదిరితే.. పాలు, నీళ్లలా కలిసిపోతుంటారు. వీలైతే.. చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. లేదంటే.. ఉప్పు, నిప్పులా చిటపటలాడుతుంటారు. ఫ్రెండ్‌షిప్‌ ఏమో కానీ.. రివేంజే ఓ రేంజ్‌లో ఉంటుంటుంది. ఏబీవీ, సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ లాంటి వాళ్లు ఆ కేటగిరీ పోలీస్ అధికారులే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సీన్ మారిపోతుంటుంది. ప్రమోషన్లు, పనిష్మెంట్లు ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంటాయి. అలాంటిదే లేటెస్ట్‌గా మరో ఆసక్తికర ఘటన జరిగింది.


వంశీ vs పీఎస్ఆర్

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ, PSR ఆంజనేయులు హాట్‌టాపిక్‌గా మారారు. ఒకే జైల్లో, ఒకే బ్యారెక్‌లో వంశీని, PSRని ఉంచారు అధికారులు. ఒకప్పుటి బద్ధ శత్రువులు ఒకే బ్యారెక్‌లో ఉండటంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.


ఆ ఇద్దరి మధ్య గొడవేంటంటే..

2011లో విజయవాడ సీపీగా PSR ఆంజనేయులు ఉన్న సమయంలో వంశీతో గొడవ జరిగింది. వంశీ వెంట అనధికార కాన్వాయ్‌ తిరుగుతోందంటూ PSR కొన్ని వాహనాలను సీజ్‌ చేయించారు. అది జరిగిన కొన్నాళ్లకే ఓ మహిళా డాక్టర్‌కు అసభ్య సందేశాలు పంపారనే ఆరోపణలతో PSR ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. అదంతా వంశీనే చేయించారనేది ఆంజనేయులు ఆరోపణ. ఆ తర్వాత PSR నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి మాజీ మావోయిస్టులకు ఆంజనేయులు సుపారీ ఇచ్చారని వంశీ ఆరోపించారు.

అప్పర్‌హ్యాండ్ ఎవరిది?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటలిజెన్స్‌ చీఫ్‌ అయ్యారు PSR ఆంజనేయులు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరిపోయారు. ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తన శత్రువు పాతపగతో ఏం చేస్తాడో అన్న భయంతోనే వంశీ వైసీపీలో చేరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేవలం PSR నుంచి ముప్పు తప్పించుకోవడానికే వల్లభనేని వంశీ వైసీపీలో చేరారని జోరుగా చర్చ జరిగింది.

Also Read : ఉర్సా క్లస్టర్స్.. అసలేంటి వివాదం? కేశినేనిల గొడవేంటి?

డాక్టర్.. యాక్టర్.. ఒకే గూటి పక్షుల్లా..

ఇప్పుడు ఒకే జైల్లో, ఒకే బ్యారెక్‌లో వంశీ, PSR ఆంజనేయులు యాదృశ్చికంగా కలిశారు. అప్పట్లో డాక్టర్‌ వల్ల ట్రాన్స్‌ఫర్ అయిన PSR ఆంజనేయులు.. ఇప్పుడు యాక్టర్ జెత్వానీ కేసులో అరెస్టయ్యారు. మరోవైపు వంశీ కిడ్నాప్‌ కేసులో జైలుపాలయ్యారు. బద్ధ శత్రువులైన వంశీ, PSR ఒకే బ్యారెక్‌లో ఉండటంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కావాలనే వాళ్లిద్దరినీ అలా ఉంచారా? అనుకోకుండా అలా జరిగిపోయిందా? జైల్లో వాళ్లిద్దరూ కలిసిపోతారా? కాంప్రమైజ్ అవుతారా? లేదంటే, పాత పగలు తీర్చుకుంటారా?

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×