E-Paper
Advertisement

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..
Advertisement

VarunTej in Pithapuram: నాగబాబు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ తొలిసారి పొలిటికల్ స్పీచ్ అదరగొట్టాడు. ఎక్కడ తడుముకోకుండా చెప్పాల్సిన నాలుగు మాటలను ఓటర్ల మనసులోకి సూటిగా వెళ్లేలా చేశాడు వరుణ్‌తేజ్.

తనవద్ద ఏమీ లేకుండా అప్పులు చేసి మరీ కౌలు రైతులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సాయం చేశారన్నాడు వరుణ్. అదే ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పాడు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయినా, ఆయన ప్రజలకు మేలు చేస్తున్నారని గుర్తు చేశాడు. ఈసారి చట్టసభలకు పంపాలని ఓటర్లను కోరాడు.

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్‌‌‌‌తేజ్ ఎన్నికల ప్రచారం చేపట్టాడు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించాడు. పిఠాపురం ప్రజలను తన కుటుంబసభ్యులుగా పవన్ భావిస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారన్నాడు. చిరంజీవి సహా మా కుటుంబం మొత్తం పవన్ బాబాయ్ వెనుకే ఉందన్నాడు. గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరాడు.

ALSO READ: ఎవరి మానిఫెస్టో దమ్మెంత? టీడీపీ Vs వైసీపీ

Advertisement

అంతకుముందు పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర‌స్వామి, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకున్న వరుణ్ తేజ్, ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొన్నారు. దుర్గాడలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×