BigTV English
Advertisement

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

VarunTej in Pithapuram: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

VarunTej in Pithapuram: నాగబాబు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ తొలిసారి పొలిటికల్ స్పీచ్ అదరగొట్టాడు. ఎక్కడ తడుముకోకుండా చెప్పాల్సిన నాలుగు మాటలను ఓటర్ల మనసులోకి సూటిగా వెళ్లేలా చేశాడు వరుణ్‌తేజ్.


తనవద్ద ఏమీ లేకుండా అప్పులు చేసి మరీ కౌలు రైతులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సాయం చేశారన్నాడు వరుణ్. అదే ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పాడు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయినా, ఆయన ప్రజలకు మేలు చేస్తున్నారని గుర్తు చేశాడు. ఈసారి చట్టసభలకు పంపాలని ఓటర్లను కోరాడు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో హీరో వరుణ్‌‌‌‌తేజ్ ఎన్నికల ప్రచారం చేపట్టాడు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించాడు. పిఠాపురం ప్రజలను తన కుటుంబసభ్యులుగా పవన్ భావిస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారన్నాడు. చిరంజీవి సహా మా కుటుంబం మొత్తం పవన్ బాబాయ్ వెనుకే ఉందన్నాడు. గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ పవన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరాడు.


ALSO READ: ఎవరి మానిఫెస్టో దమ్మెంత? టీడీపీ Vs వైసీపీ

అంతకుముందు పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర‌స్వామి, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకున్న వరుణ్ తేజ్, ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొన్నారు. దుర్గాడలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×