E-Paper
Advertisement

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు
Advertisement

Dasara 2025: దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సుందరంగా ముస్తాబైంది. రేపటి(సెప్టెంబర్ 22) నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులు పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను మొత్తం 11 రోజులు జరుపుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అలంకరణ షెడ్యూల్ ను ఆలయ ఈవో విడుదల చేశారు.

అమ్మవారి అలంకారం వివరాలు ఇలా

  • సెప్టెంబర్ 22- బాలా త్రిపుర సుందరి దేవి(మొదటి రోజు)
  • సెప్టెంబర్ 23 – గాయత్రీ దేవి(రెండో రోజు)
  • సెప్టెంబర్ 24 – అన్నపూర్ణాదేవి(మూడో రోజు)
  • సెప్టెంబర్ 25 – కాత్యాయని దేవి(నాలుగో రోజు)
  • సెప్టెంబర్ 26 – మహాలక్ష్మి దేవి (ఐదో రోజు)
  • సెప్టెంబర్ 27 – లలితా త్రిపుర సుందరి దేవి (ఆరో రోజు)
  • సెప్టెంబర్ 28 – మహాచండి దేవి (ఏడో రోజు)
  • సెప్టెంబర్ 29 – సరస్వతి దేవి (ఎనిమిదో రోజు)
  • సెప్టెంబర్ 30 – దుర్గాదేవి (తొమ్మిదో రోజు)
  • అక్టోబర్ 1 – మహిషాసురమర్దిని (పదో రోజు)
  • అక్టోబర్ 2 – రాజరాజేశ్వరి దేవి(విజయ దశమి)

మూల నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పణ

నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29న మూల నక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రూ.500 దర్శనం టికెట్లు రద్దు

Advertisement

ఈ ఏడాది తిధుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 11వ అవతారం కాత్యాయని దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శన సమయం కేటాయించారు. ఈ దసరా ఉత్సవాల నేపథ్యంలో రూ. 500 టికెట్లు రద్దు చేసి కేవలం రూ. 300, రూ. 100 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.

Also Read: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు ప్రత్యేక దర్శనం

Advertisement

వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. క్లూ లైన్ లో భక్తులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. దసరా ఉత్సవాలకు 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్ తో ఉత్సవాలను పర్యవేక్షించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల వాహనాల కోసం 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×