BigTV English
Advertisement

Fake Gold in Vizag: 2.2 కిలోల నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. రూ.68 లక్షల మోసం.. విశాఖలో గోల్‌మాల్!

Fake Gold in Vizag: 2.2 కిలోల నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. రూ.68 లక్షల మోసం.. విశాఖలో గోల్‌మాల్!

Fake Gold in Vizag: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. ఎకంగా బ్యాంక్ సిబ్బందే స్కాం చేయడంతో వైజాగ్‌లో ఈ ఘటన సంచలనంగా మారింది. బ్యాంక్‌లలో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం వ్యవహారం బయటకు వచ్చిందని ద్వారకా నగర్ పోలీసులు తెలిపారు.


పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్వర్ రావు, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు కొంతకాలం క్రితం రూపిక్ బ్యాంక్‌లో 2.2 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇటీవల విడిపించుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్‌లో రూ.68 లక్షల 31 వేలు కట్టి బంగారాన్ని తిరిగి తీసుకున్నారు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలిస్తే బంగారం  తేడాగా అనిపించిదని జగదీశ్వర్ తెలిపారు. గోల్డ్‌ను తనిఖీ చేసి నకిలీ బంగారంగా అఫ్రైజర్ గుర్తించారు.

దీంతో జగదీశ్, అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రూపిక్ బ్యాంక్‌లో పని చేస్తున్న ఈశ్వరరావు, రాఘవేంద్రరావు, మోహన్ రావు, సుబ్బారావు నకిలీ బంగారాన్ని పెట్టినట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మోసం చేసిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


విచారణ తర్వాత ఇప్పటి వరకు వీళ్లు ఎన్ని మోసాలు చేశారు. దీని వల్ల ఇంకా ఎంత మంది నష్టపోయారు అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత నిందితులు కాజేసిన నగదు, బంగారం వివరాలు వెల్లడిస్తామన్నారు.

Tags

Related News

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Big Stories

×