BigTV English

Rushikonda Palace: విశాఖ రుషికొండ ప్యాలెస్.. మళ్లీ వార్తల్లోకి.. త్వరలోనే అసలు ముహూర్తం?

Rushikonda Palace: విశాఖ రుషికొండ ప్యాలెస్.. మళ్లీ వార్తల్లోకి.. త్వరలోనే అసలు ముహూర్తం?

Rushikonda Palace: వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్యాలెస్ అది. ఈ ప్యాలెస్ చుట్టూ రాజకీయం ఎలా నడిచిందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ప్యాలెస్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అసలు ఇంత పెద్ద భవనాన్ని ఏమి చేస్తారన్న సందేహం ప్రతి ఒక్కరిదీ. అయితే మళ్లీ ఇప్పుడు ఈ ప్యాలెస్ వార్తల్లో నిలిచింది. ఇంతలా చెప్పాక ఇప్పటికే మీ మైండ్ లో గిర్రున తిరిగిన ప్యాలెస్ అదే కదా.. అదేనండీ విశాఖలో గల రుషికొండ ప్యాలెస్.


అసలు విషయం ఏమిటంటే?
విశాఖపట్నంలోని రుషికొండ పర్వత ప్రాంతం.. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఇటీవల తలెత్తిన వివాదాలు. ఇటీవల ఆ ప్రాంతంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ గురించి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి పేరుతో అక్కడి పాత రిసార్ట్‌లను కూల్చివేసి, భారీగా ఖర్చుతో ఓ భవంతిని నిర్మించడం జరిగిందని, ఇప్పుడు అది ప్రభుత్వానికి ఆస్తిగా కాకుండా భారంగా మారిందన్నదే ప్రభుత్వ వాదన.

ప్రస్తుతం ఆ ప్యాలెస్ నిర్వహణకు భారీగా ఖర్చు అవుతోందని, ప్రభుత్వ పర్యాటక శాఖకు అంతకుముందు వచ్చిన ఆదాయం పూర్తిగా కోల్పోయామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ భవనాన్ని పూర్తి చేయడానికి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితిని కూడా వారు వర్ణించారు. పైగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పర్యాటక రిసార్ట్ స్థానంలో, నిరుపయోగంగా నిలిచిపోయిన ఈ భవంతి ప్రజాధనం వృథా అయ్యేలా మారిందని విమర్శలు వస్తున్నాయి.


ఇందుకు స్పందనగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇటీవల ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఈ భవంతిని ఎలా వాడాలో, దాన్ని ఎలా ప్రజలకు ఉపయోగపడేలా మార్చాలో సీఎం ఆలోచిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో దీనిపై తదుపరి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇదివరకు ఆ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ నిర్వహించిన రిసార్ట్ పర్యాటకులకు అందుబాటులో ఉండేది. విశాఖ సముద్ర తీరంకు దాదాపుగా దగ్గరే కనిపించే ఈ ప్రదేశంలో, వారాంతపు విహారాల కోసం వచ్చే సందర్శకుల సంఖ్య పెద్దఎత్తున ఉండేది. కానీ గత ప్రభుత్వం ఆ రిసార్ట్‌ను తొలగించి, అక్కడ ప్రభుత్వాధికారుల కోసం ప్రైవేట్ వినియోగానికి ఈ ప్యాలెస్ నిర్మించడంతో పర్యాటక ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

Also Read: TTD Help Line: తిరుమలలో బుకింగ్ ఫెయిల్.. డబ్బు పోయిందా? వెంటనే ఇలా చేయండి!

ఇప్పుడు తాజా పరిస్థితుల్లో ఆ ప్యాలెస్ నిలుపుదల ఖర్చు ప్రభుత్వ ఖజానాపై భారమవుతోంది. ఈ క్రమంలోనే, దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చడం లేదా పర్యాటక వినియోగానికి అందుబాటులోకి తేవడం వంటి ఆలోచనలు నడుస్తున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి త్వరలో దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకోనున్నారు.

వాస్తవానికి, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం, ఇప్పటికే కొత్త దిశలో పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. లేపాక్షి, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాల్లో వినూత్న పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు విశాఖలో ఉన్న ఈ ప్యాలెస్ విషయంలో కూడా ప్రజల కోసం ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకుంటుందా? లేక మరో ప్రయివేట్ వినియోగ మార్గాన్ని అనుసరిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రజాధనం మళ్లీ ప్రజలకే అందుబాటులోకి రావాలని ఆకాంక్షించే ప్రజలు, ఇప్పుడు ఈ ప్యాలెస్ విషయంలో తీసుకునే సీఎం నిర్ణయంపై తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మరి రుషికొండ ప్యాలెస్.. పర్యాటకానికి కొత్త ప్రేరణ ఇస్తుందా? ప్రభుత్వం దీనిని ఎలా వినియోగిస్తుందన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి దుర్గేష్ కామెంట్స్ ను బట్టి చెప్పవచ్చు.

Related News

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Parakamani Theft: ఏపీలో ‘పరకామణి’ రాజకీయాలు.. నిరూపిస్తే తల నరుక్కుంటా -భూమన

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

Big Stories

×