E-Paper
Advertisement

Vishaka District: లంకె బిందెల స్వాముల మాయలు.. నమ్మితే మీ జీవితం మారినట్టే..

Vishaka District: లంకె బిందెల స్వాముల మాయలు.. నమ్మితే మీ జీవితం మారినట్టే..
Advertisement

Vishaka District: లంకె బిందెల పేరుతో దొంగ బాబా ఘరానా మోసానికి పాల్పడిన.. ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆనందపురం మండలం బంటుపల్లి వారి కల్లాలకు చెందిన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగ బాబా మరో ఆరుగురుతో కలిసి ఈ బాగోతానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం అప్పలరాజుకు బంధువుల ద్వారా.. యోగేంద్ర బాబా అలియాస్ పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ పరిచయం అయ్యారు. పూజలు చేస్తే లంకెల బిందెలు దొరుకుతాయని నమ్మించాడు. లంకె బిందెలు వెతకడానికి, పూజలకు లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయని వారికి తెలిపాడు.

అప్పలరాజు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాబాకు పలు దఫాలుగా 28 లక్షలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ మేరకు తన ప్లాన్ ప్రకారం ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు దొంగ బాబా. ఆ తర్వాత గుడిలోపలోని నిర్మానుష్య ప్రాంతంలో రాళ్లతో నింపిన నకిలీ లంకెల బిందెలను పాతిపెట్టారు. అప్పలరాజు సహా మిగతావారిని అక్కడికి తీసుకెళ్లి.. పూజలు నిర్వహించాడు.

Advertisement

పూజలు అనంతరం లంకె బిందెలను పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించాడు. లంకె బిందెలు బయటపడటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. వాటిని ఆనందపురంలో అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం తెరవాలని దీని కోసం కొంత డబ్బులు తీసుకురావాలని బాధితులకు తెలిపారు.

పూజలు చేయకపోతే రక్తం కక్కుకుని చస్తారంటూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు బాధితులు. డబ్బులు ఇచ్చేందుకు బాబాకు ఫోన్ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ఆనందపురం సిఐ వాసు నాయుడు దొంగబాబాతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Advertisement

Also Read:  వైజాగ్‌లో క్రికెట్ బెట్టింగ్.. ‘బిగ్ బాస్’ కోసం పోలీసుల వేట..

వీరిలో పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ పేరిట అలియాస్ యోగేంద్ర బాబాపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 7 కేసులు నమోదయినట్టు వెల్లడించారు. ప్రజలు డబ్బు మీద ఆశతో దొంగ బాబాల చేతిలో మోసపోవద్దంటున్న సీఐ వాసు నాయుడు పేర్కొన్నారు.

 

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×