E-Paper
Advertisement

Vallabhaneni Vamsi: జైలు నుంచి వల్లభనేని వంశీ రిలీజ్.. ఎలా మారిపోయాడో చూడండి

Vallabhaneni Vamsi: జైలు నుంచి వల్లభనేని వంశీ రిలీజ్.. ఎలా మారిపోయాడో చూడండి

Vallabhaneni Vamsi: ఎట్టకేలకు.. విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలిచ్చారంటూ నమోదైన కేసులో.. వంశీని ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత.. ఆయనపై వరుసగా మరిన్ని కేసులు నమోదయ్యాయి. వంశీపై మొత్తంగా 11 అక్రమ కేసులు నమోదు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 4 నెలలకు పైగా వంశీ జైలులో ఉన్నారు. ఇప్పటికే.. కొన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చింది.

నాలుగున్నర నెలల పాటు జైల్లో ఉన్న వంశీ.. బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు. మొత్తానికి.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది. గత నెలలోనే మరో రెండు కేసుల్లో వంశీకి బెయిల్‌ వచ్చింది. దాంతో వంశీపై పెట్టిన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్‌ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీకి స్వాగతం పలికేందుకు.. జైలు దగ్గరికి ఆయన సతీమణి పంకజ శ్రీతో పాటు వైసీపీ నేత పేర్ని నాని, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, కైలే అనిల్‌ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు.

మరోవైపు.. వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై.. వాదనలు విన్న తర్వాత.. బెయిల్ రద్దుపై విచారణకు ఈ నెల 16కు వాయిదా వేసింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే.. బెయిల్ రద్దు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తమ వాదనలు వినకుండానే.. వంశీకి బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.

అక్రమ మైనింగ్ ద్వారా వంశీ 196 కోట్లు సంపాదించారనడానికి ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తు రిపోర్ట్.. 700 పేజీలు ఉందన్నారు. అందువల్ల.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే.. సీల్డ్ కవర్‌లో రిపోర్ట్ దాఖలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 16కు వాయిదా వేసింది.

Also Read: కాకాణికి మొహం చాటేసిన జగన్.. నెల్లూరు పర్యటన రద్దు.. ఎందుకంటే?

వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టించి కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్ని కేసులు పెట్టినా, కుట్రలు పన్నినా గన్నవరం నుంచి వంశీని పక్కకు తప్పించలేరని తెలిపారాయన. అంతేకాదు.. నియోజకవర్గంలో ఏడాది తిరగకుండానే వంశీకి సానుభూతి వచ్చేలా ప్రభుత్వం చేసిందని సెటైర్లు వేశారు పేర్ని నాని.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×