E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!

YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!
Advertisement

YS Jagan Mohan Reddy:  ఎన్టీవీ (NTV) జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.

“పండుగ పూట అర్ధరాత్రి వేళ, కనీస చట్టపరమైన నోటీసులు ఇవ్వకుండా, జర్నలిస్టుల ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి బలవంతంగా అరెస్టు చేయడం అత్యంత విచారకరం. ఇది నిరంకుశ ధోరణికి నిదర్శనం. జర్నలిస్టులు నేరస్తులు కాదు, తీవ్రవాదులు అంతకంటే కాదు. కానీ వారిని ఇంత కఠినంగా ఎదుర్కోవడం అన్యాయం.” అని పేర్కొన్నారు.

Advertisement

అంతేకాకుండా, ఇటువంటి చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాయని, మీడియా వర్గాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “వెంటనే అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి. చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.” అని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు (TUWJ, IJU, ప్రెస్ క్లబ్) ఈ అరెస్టులను ఏకగ్రీవంగా ఖండిస్తున్నాయి.  నోటీసులు ఇవ్వకుండా, పండుగ రోజున కుటుంబ సభ్యుల సమక్షంలో తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని జర్నలిస్టు నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×