E-Paper
Advertisement

Sharmila Comments on Jagan: అప్పుడెందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా..? : జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

Sharmila Comments on Jagan: అప్పుడెందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా..? : జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

Sharmila Comments on Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైరయ్యారు. జగన్ హత్యా రాజకీయాలు చేశారంటూ మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారంటూ ఆమె ఆరోపించారు. వివేకా హంతకులతో జగన్ మోహన్ రెడ్డి తిరుగుతున్నారన్నారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు? జగన్ ను సూటిగా ప్రశ్నించింది. వినుకొండ హత్య.. వ్యక్తిగతంగా జరిగిందన్నారు. అది రాజకీయ హత్య కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాలన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ షర్మిల సూచించారు.

వైఎస్సార్ తలపెట్టి జలయజ్ఞం కార్యక్రమాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టు కట్టకపోగా ఉన్నవాటికి కూడా మరమత్తులు లేవని.. సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడంటూ ఆమె ఆరోపించింది. అప్పులేని రైతు అంటూ రాష్ట్రంలో లేడని, ధరల స్థిరీకరణ నిధి అంటూ మోసం చేశాడని.. ఇలాంటి రైతుల మీద ఇప్పుడు పడ్డ వానలు మరోసారి భారాన్ని మోపాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వర్షాలు భారీ ఎత్తున నష్టాన్ని మూట గట్టాయన్నారు. వేసిన పంటలు వేసినట్లే కొట్టుకుపోయాయన్నారు. మళ్లీ పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందంటూ ఆమె వాపోయారు. ఇలాంటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆమె డమాండ్ చేశారు.

Also Read: మదనపల్లె ఆర్డీవో ఆఫీసును పరిశీలించిన డీజీపీ.. ఏం చెప్పారంటే..?

అదేవిధంగా రుణమాఫీ విషయంలో చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీలో రైతుల రుణమాఫీ చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు నెత్తిన కనీసం రూ. 2 లక్షల అప్పు ఉన్నందున, ప్రభుత్వం రుణమాఫీ చేయాలన్నారు. అదేవిధంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారని గుర్తుచేస్తూ.. వీరంతా బీజేపీకి మద్దతిస్తున్నారు కానీ, ప్రయోజనం శూన్యమన్నారు. మన ఎంపీలను బీజేపీ వాడుకుంటుందన్నారు. ప్రత్యేక హోదాపై ఎంపీలు పోరాటం చేయాలన్నారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×