E-Paper
Advertisement

YS Sharmila: వైఎస్సార్‌ను తాగుబోతు అన్న బొత్స.. ఇప్పుడు తండ్రిసమానుడయ్యాడా?.. జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila: వైఎస్సార్‌ను తాగుబోతు అన్న బొత్స.. ఇప్పుడు తండ్రిసమానుడయ్యాడా?.. జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
Advertisement

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన అన్న, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారే వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్సార్‌ను తీవ్రంగా విమర్శించిన మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానుడు ఎలా అయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సీఎం జగన్ మంత్రి వర్గంలో ఉన్నవాళ్లంతా గతంలో తన తండ్రి వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లేనని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో జగన్‌ను ఉరివేయాలని అన్నారని ఒకప్పటి మాటలను వైఎస్ షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ ఓ తాగుబోతు అన్నాడని.. తన తల్లి విజయమ్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. అలాంటి వ్యక్తులకు మాత్రమే జగన్ పెద్దపీట వేశారని, తండ్రిని తిట్టిన వాళ్లంతా ఇప్పుడు అతనికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అయ్యారంటూ విమర్శించారు.

Advertisement

Also Read: Jagan comments Botsa tears: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?

జగన్ రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారు తారనేదానికి ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వారంతా అతనికి ఏమి కారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కోసం పని చేసి.. గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఏం కారని అన్నారు. వైఎస్సార్ పార్టీలో వైఎస్సార్ లేరని విమర్శించారు. వై అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని వైసీపీకి కొత్త అర్థాన్ని వైఎస్ షర్మిల చెప్పారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×