E-Paper
Advertisement

Buggana with Jagan: వీఎస్‌ఆర్ స్థాయి కోసం కుస్తీ.. ఛాన్స్ ఇస్తే ఇటు, లేకుంటే అటు?

Buggana with Jagan: వీఎస్‌ఆర్ స్థాయి కోసం కుస్తీ.. ఛాన్స్ ఇస్తే ఇటు, లేకుంటే అటు?

Buggana with Jagan: వైసీపీలో ఏం జరుగుతోంది? ఉత్తరాది, సీమ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? కేవలం కృష్ణా, గుంటూరు నేతలు మాత్రమే రియాక్ట్ అవుతున్నారా?  వైసీపీ అధిష్టానం వారిని పక్కనపెట్టిందా? వాళ్లే దూరంగా ఉంటున్నారా? మాజీ మంత్రి బుగ్గన మనసు మారబోతోందా? స్థానిక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారా? ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

బుగ్గన ఆలోచనేంటి?

వైసీపీ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆనాటి ఆర్థికమంత్రిగా ఆయన కష్టాలు అన్నీఇన్నీ కావు. నిధుల కోసం వారంలో మూడు రోజులు ఢిల్లీకి వెళ్లేవారు. అసెంబ్లీలో పిట్ట కథలు చెప్పేవారు. ఆయన మాటలు సభ్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయని అప్పుడప్పుడు కొందరు నేతల మాట. కేబినెట్ విస్తరణలోనూ ఆయన్ని టచ్ చేయలేదు జగన్.

మరో విషయం ఏంటంటే.. వైసీపీ రూలింగ్‌లో అమరావతి కంటే ఢిల్లీలో ఆయన ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఆ విధంగా బీజేపీ పెద్దలతో క్రమంగా పరిచయాలు పెరిగాయి. ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయని అనుకోండి. అదే వేరే విషయం. మరి ఏమనుకున్నారో తెలీదుగానీ లోకల్ పాలిటిక్స్‌ కు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. పొలిటికల్ పిచ్ మార్చాలని ఆలోచన చేస్తున్నారట.

యాక్టివ్‌గా కొడుకు అర్జున్

ఈ లెక్కన డోన్ నియోజకవర్గానికి దూరం కావాలని అనుకుంటున్నారట. స్థానికంగా వైసీపీ తరపున బుగ్గన కొడుకు అర్జున్ యాక్టివ్‌గా ఉన్నాడు. కొద్దినెలలుగా అర్జున్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తున్నారట బుగ్గన. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి కొన్నాళ్లు ఇబ్బందులు తప్పవని సన్నిహితుల వద్ద వాపోయారట.

ALSO READ: ఎకరం 99 పైసలే.. ఏపీలో కారు చౌకగా ప్రభుత్వ భూములు

ఢిల్లీ రాజకీయాలపై బుగ్గన గురి

అలాగని రాజకీయాలకు ఆయన దూరం కారని అంటున్నారు సన్నిహితులు. వచ్చే ఎన్నికల నాటికి లోక్‌సభకు పోటీ చేయాలని స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ వద్ద చెప్పినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇన్నాళ్లు వైసీపీ తరపున ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టేవారు విజయసాయిరెడ్డి. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేయాలన్నది బుగ్గన ఆలోచనగా చెబుతున్నారు సన్నిహితులు.

ఆర్థికమంత్రిగా గడిచిన ఐదేళ్లు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఈ విషయంలో పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం జగన్.. బుగ్గనను ఢిల్లీ వైపు పంపిస్తారా? అన్నది అసలు పాయింట్. ఇప్పటికే ఎంపీ మిధున్‌రెడ్డి ఆ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. కచ్చితంగా తనకు అధినేత అవకాశం ఇస్తారని అంటున్నారు.

ఎన్నికల ముందు నిర్ణయం?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారాయన. వైసీపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకుంటే ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. వీలైతే కమలం వైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. రాబోయే రోజుల్లో ఏం జరగుతుందో చూడాలి.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×