E-Paper
Advertisement

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఈ గొడవలలో వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇన్నోవా కారుని సొంత పార్టీ నేతలే తగలబెట్టారు. దాంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ దాడిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వాహనాలు ధ్వంసమైనా ఇసుక రీచ్ వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు.

ఇరు వర్గాలు వైసీపీకి చెందిన వారే కావడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక అగ్రనేత ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎటువంటి ఫిర్యాదులు, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు ఆ అగ్రనేత అల్టిమేటం ఇచ్చారని తెలుస్తోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×