YSRCP MPs: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు సమావేశ మయ్యారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అమిత్ దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకెల్లారు. మూడు అంశాలపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పై అమిత్ షా కు ఫిర్యాదు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తగినంత భద్రత కల్పించడంలో విఫలమవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. నిన్న జగన్ మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు గుమిగూడినప్పటికీ, పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయలేదని ఎంపీలు తెలిపారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆయన జరిపే అన్ని బహిరంగ పర్యటనలలో ఇదే పద్ధతి కొనసాగుతోందని, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దురుద్దేశంతో ఇలా చేస్తోందని ఆరోపించారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేశారని ఆరోపించిన వైసీపీ ఎంపీలు తెలిపారు. అవినీతి, అవకతవకల కారణంగా అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని, దీనివల్ల నిరుద్యోగ యువత, విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఎంపీలు పేర్కోన్నారు. నియామక ప్రక్రియపై నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని ఎంపీలు డిమాండ్ చేసారు.
Also Read: యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను అక్రమ నిర్బంధాలు, రాజకీయ ప్రేరేపిత కేసుల ద్వారా లక్ష్యంగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఎంపీల ఆరోలు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులను ఉదాహరణగా పేర్కొన్నారు. గత రెండు నెలల్లో లాకప్లలో నలుగురు మరణించినట్లు వచ్చిన వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు డిమాండ్ చేశారు.
అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రోడ్లను దిగ్బంధించి, భారతీ సిమెంట్స్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ దానిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్న ఎంపీలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తాయని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు, ప్రజా భద్రత, చట్టబద్ధమైన పాలన, నిష్పక్షపాత పెట్టుబడి వాతావరణం ఉండేలా చూడాలని అమిత్ షా వైసీపీ ఎంపీలు కోరారు.
Also Read: మరో వేటకు సిద్ధమవుతున్న హైడ్రా.. 176 కాలేజీలపై హైడ్రా అధికారులు గురి!