UPI Charges: యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు వీలుగా ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. లావేదేవీలపై ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు ఇచ్చేందుకు లోక్ సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ లేకుండానే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
ఈ బిల్లు ద్వారా నిర్దిష్ట లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే అధికారం ప్రతి బ్యాంకులకు లభించనుంది. పెద్ద వ్యాపార సంస్థలకు (మర్చంట్లు) జరిగే నిర్దిష్ట అధిక విలువ గల లావాదేవీలపై మాత్రమే ఈ ఛార్జీల భారం పడే అవకాశం ఉందని సాధారణ సామాన్య వినియోగదారులు (పీపుల్-టూ-పీపుల్ ట్రాన్సాక్షన్స్) చేసే సాధారణ యూపీఐ చెల్లింపులపై దీని ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు పేర్కోన్నారు.
Also Read: ఎమ్మెల్సీ టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం నిర్ణయం.. నేతలందరికి ట్రిపుల్ ఫిల్టర్!